Friday, 11 January 2013

[YSR ] ఇది కాలపరీక్ష మాత్రమే


భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో డెబ్భై భారీ, చిన్న ప్రాజెక్టులను ఏకకాలంలో ప్రారంభించిన ధీశాలి వై.ఎస్. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచిన ఏకైక ముఖ్యమంత్రి కూడా ఆయనే. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వారు, ఢిల్లీలో చక్రం తిప్పిన వారు ఇప్పుడు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో మీడియా సాయంతో వై.ఎస్.పైన, ఆయన కుమారుడు జగన్‌పై బురద జల్లుతున్నారు. కానీయండి. నిజాన్ని దాచడం, సూర్యుణ్ణి ఆపటం ఎవరితరమూ కాదు. కాలపరీక్షలో జగన్ గెలుస్తాడు. సీబీఐ ఓడుతుంది. రాముడు వనవాసం చేసినా, పాండవులు అరణ్యవాసం చేసినా, జీసస్ శిలువ మోసినా, హరిశ్చంద్రుడు కాటి కాపరైనా, నలమహారాజు కురూపి అయినా, జగన్ జైలుకు వెళ్లినా అంతా కాలపరీక్షలో భాగమే. త్వరలోనే వై.ఎస్. జగన్ పాలన ఒక స్వర్ణయుగంగా ప్రారంభం కావడమన్నది తథ్యం.