సహకార సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఎన్నికల
నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్లకు సోమవారం
ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సహకార శాఖమంత్రి కాసు
కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాంతో సహకార
ఎన్నికలపై అయోమయం నెలకొంది.