రాష్ట్ర
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ సీపీ నేత గౌతంరెడ్డి ఆదివారం
బెజవాడలో పాదయాత్ర చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే
ఉపసంహరించుకోవాలని గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి పేదవాడికి ఇళ్ల
స్థలాలు కేటాయించాలన్నారు. పాదయాత్రలో పాల్గొన్న పార్టీ అధికార ప్రతినిధి
అంబటి రాంబాబు మాట్లాడుతూ పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలన్నారు.
ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరకొచ్చాయని ఆయన అన్నారు.
పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.