పశ్చిమ
గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మల్లెల లక్ష్మీనారాయణ
శనివారం చంచల్గూడలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన
విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు కుట్రల ఫలితంగానే
జగన్ను జైలులో ఉంచారన్నారు. జనం జగన్ వెంట ఉన్నారని, తాను కూడా పార్టీ
కోసం కృషి చేస్తానని చెప్పారు.