Friday, 25 January 2013

[YSR ] వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులపై లాఠీచార్జ్


సహకార ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చిత్తూరు జిల్లా పీలేరులో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతల దాదాగిరిని అడ్డుకోవాల్సిందిపోయి వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులపైనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో తిరుపతి- మదనపల్లె రహదారిపై వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు బైఠాయించారు.