వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో
ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా ఐజకు
చేరుకుంది. షర్మిలకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం
పలికారు. ఐజలో బుడగ జంగాలుతో షర్మిల మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారానికి
కృషి చేయాలని కోరుతూ షర్మిలకు బుడగ జంగాలు ఈ సందర్భంగా వినతిపత్రం ఇచ్చారు.