వైఎస్
జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులపై మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి
చేస్తామని సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ తెలిపారు. నిపుణుల ఆధ్వర్యంలో
దర్యాప్తు కొనసాగుతుందని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. హైకోర్టు,
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని ఏపీ సింగ్
తెలిపారు. కాగా మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని గతంలో సీబీఐ
సుప్రీంకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. అయితే రెండునెలల తర్వాత కూడా
సీబీఐ డైరెక్టర్ అదే మాట చెబుతున్నారు.