మహానేత
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర వల్లే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయిందని
మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆనాడు వైఎస్ఆర్ పాదయాత్ర చేసి
అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు వేగంవంతం అయ్యాయని డీఎల్
అభిప్రాయ పడ్డారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులు పూనాదిరాళ్లకే
పరిమితమయ్యాయని డీఎల్ విమర్శించారు.