దేశ,
రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ చక్రం తిప్పబోతున్నారని నెల్లూరు ఎంపీ
మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్లు
భూస్థాపితం కావడం ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్ సీపీకి
200కు పైగా సీట్లు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల
విశ్వాసం కోల్పోయారన్నారు. పాదయాత్ర ద్వారా కూడా ఆయన ప్రజలను
ఆకట్టుకోలేకపోయారని అన్నారు. 9 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఎమ్మెల్యేల
ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు.