వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీఆర్ఎస్
నాయకులు వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గట్టు
రామచంద్రరావు శనివారం పేర్కొన్నారు. ఈ పద్దతి మానుకోవాలని టీఆర్ఎస్
నాయకులకు ఆయనహితవు పలికారు. ప్రజలను భయపెట్టి బతకాలని టీఆర్ఎస్ పార్టీ
చూస్తోందని ఆయన అన్నారు. ఒక పార్టీని మరొక పార్టీ అడ్డుకునే సంస్కృతిని
టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇది మంది సంస్కృతి కాదని గట్టు
రామచంద్రరావు అభిప్రాయపడ్డారు.