Tuesday, 20 November 2012

[YSR ] వైఎస్‌ను విమర్శిస్తే ఊరుకోం: కోమటిరెడ్డి


మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలను అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 9లోగా తెలంగాణపై ప్రకటన రాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేయనున్నట్టు కోమటిరెడ్డి ప్రకటించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ మంత్రులు కలసిరావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.