వై.ఎస్.ఆర్.కాంగ్రెస్
అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతానని భువనగిరి కాంగ్రెస్
ఎమ్.పి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ప్రకటించారు.తెలంగాణ లో కాంగ్రెస్
తరపున పోటీచేసినా గెలిచే పరిస్థితి లేదని కూడా ఆయన స్పష్టం
చేశారు.రాష్ట్రంలో పాలన అస్తవ్యస్థంగా మారిందని కూడా ఆయన
విమర్శించారు.తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్ నూకలు చెల్లినట్లేనని
చెప్పిన ఈయన జగన్ మాత్రమే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలడని వ్యాఖ్యానించడం
విశేషం.తగు సమయంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరనున్నట్లు కూడా ఆయన
చెప్పినట్లు కధనాలు వస్తున్నాయి. దీంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖరారైపోయింది.
తెలంగాణవాదిగా పేరొందిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తొలుత నుంచి
వై.ఎస్.రాజశేఖరరెడ్డికి సన్నిహితులుగా ఉన్నారు.....................