Tuesday, 20 November 2012

YSR ] ‘వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో ఎవరూ చనిపోలేదు’

పట్టణంలో జరిగిన వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో ఎవరూ చనిపోలేదని డీఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో ఓ వ్యక్తి చనిపోయాడన్న వార్తలపై డీఎస్పీ వివరణ ఇచ్చారు. మీటింగ్ సమీపంలో రైతు బజార్‌లో సోమవారం ఓ వృద్ధుడు చనిపోవడంతో వచ్చిన వదంతులపై అతని కుటుంబ సభ్యులను సునీతారెడ్డి విచారించారు. వృద్ధునికి ఫిట్స్ రోగం రావడంతో మాత్రమే మృతి చెందాడని అతని కుమారుడు డీఎస్పీకి తెలిపాడు.