మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల చేపట్టిన పాదయాత్ర పెద్దపల్లికి
చేరుకుంది. ఆమెకు మహిళలు,అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
షర్మిల మంగళవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లాలోని బూడిదపాడు నుంచి 41వ రోజు
పాదయాత్రను ప్రారంభించారు. పెద్దపల్లి, కురువపల్లి, గద్వాల రైల్వే స్టేషన్
రోడ్, రాజీవ్ మార్గ్, వైఎస్ఆర్ సర్కిల్, రాయచూర్ రోడ్డు మీదుగా
యాత్ర కొనసాగుతుంది.