2014 ఎన్నికల్లో 225 అసెంబ్లీ, 35 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆపార్టీ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి
ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. రానున్న రోజులు వైఎస్ఆర్ సీపీవేనని, కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాల్లో పార్టీ చక్రం తిప్పుతుందని ఆయన గురువారమిక్కడ
తెలిపారు. వైఎస్ జగన్ మద్దతిచ్చిన వ్యక్తే ప్రధానిగా ఉంటారని నల్లపరెడ్డి
పేర్కొన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు.