అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని షర్మిల సూటిగా
ప్రశ్నించారు. చంద్రబాబే కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆమె
మండిపడ్డారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లా
అలంపూర్ నియోజకవర్గంలోని శాంతి నగర్లో శనివారం షర్మిల నీచ రాజకీయాలపై
నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీలు సీబీఐను వాడుకుని జగనన్నను జైల్లో
పెట్టించారన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టీడీపీలకు బుద్ది
చెప్పాలని షర్మిల ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
|