వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 70 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా
ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా కన్వీనర్ సామినేని
ఉదయభాను అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్
పార్టీతో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవటానికి చంద్రబాబు అవిశ్వాస
తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. ఓ వైపు తుగ్లక్ పాలన అంటున్న చంద్రబాబు
మరోవైపు అవిశ్వాసం పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు.