కడప
ఎంపీ జగన్మోహరెడ్డి సోదరి షర్మిల త్వరలో చేపట్టబోయే మరో ‘ప్రజా ప్రస్థానం’
పాదయాత్రకు సమన్వయ, కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు శనివారం
సమన్వయ, కార్యాచరణ కమిటీ సభ్యులను నియమించారు. ‘ప్రజా ప్రస్థానం’ కమిటీ
సభ్యులుగా భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాం, కోటంరెడ్డి
శ్రీధర్రెడ్డి, బాజిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ప్రసాదరాజు, శివశంకర్
రెడ్డి, నల్లా సూర్య ప్రకాశ్, కేకే మహీందర్ రెడ్డిలను నియమించారు.