భువనగిరి:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భువనగిరి
చేరుకున్నారు. ఆమెకు కార్యకర్తలు, అభిమానులు మేళతాళాలు, తప్పెట్లతో
ఘనస్వాగతం పలికారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ భారీ బహిరంగ సభ
ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు ఆమె ఇక్కడకు వచ్చారు.