పులివెందుల,
న్యూస్లైన్ : శనివారం షర్మిల పాదయాత్ర పులివెందులలోని పార్నపల్లె
రోడ్డులో ఉన్న రుషి స్కూలు వరకు చేరుకుంది. అక్కడ బస చేసిన షర్మిల ఆదివారం
ఉదయాన్నే పులివెందుల రింగ్రోడ్డు మీదుగా చిన్నరంగాపురం, ఇప్పట్ల,
చిన్నకుడాల క్రాస్, పెద్ద కుడాల క్రాస్ మీదుగా లింగాలకు చేరుకొని బహిరంగ
సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి లోపట్నూతల క్రాస్ వద్దకు వరకు
పాదయాత్ర సాగనుంది. అనంతరం ఆదివారం రాత్రి అక్కడనే బస చేస్తారు.