అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన
పాదయాత్ర 9వ రోజున శుక్రవారం తుమ్మలక్రాస్నుంచి ప్రారంభం కానుంది.
మల్లేనిపల్లి, ధర్మవరం, శివానగర్, పేరు బజార్, అంజుమన్సర్కిల్,
గాంధీనగర్, గొల్లపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. పీఆర్టీ సర్కిల్
వద్ద బహిరంగ సభ జరగనుంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు
వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు.