భువనగిరి:
నల్గొండ జిల్లా భువనగరిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ సీపీ గౌరవ
అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలో విజయమ్మ
సమక్షంలో యువతెలంగాణ పార్టీ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి వైఎస్ఆర్
సీపీలో చేరనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు భువనగిరిలో బహిరంగసభ
జరుగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.