తిరుపతి:
తిరుచానూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక
పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర వైఎస్ఆర్
కుటుంబానికి పేటెంట్ హక్కు అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్రను టిడిపి అధ్యక్షుడు
చంద్రబాబు కాపీకొట్టారన్నారు. ప్రజల కడగండ్లు తుడవడానికే షర్మిలమ్మ
పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. పాదయాత్ర సజావుగా జరగడానికి దేవదేవుణ్ని
కోరుకోవడానికి తిరుమల వచ్చినట్లు తెలిపారు.