శనివారపుపేట:
ఏలూరు ప్రజలను సీఎం కిరణ్ మోసం చేశారని ఎమ్మెల్యే ఆళ్ల నాని విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని శనివారపుపేటలో ఎమ్మెల్యే
ఆళ్ల నాని చేపట్టిన పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా నాని
మాట్లాడుతూ..పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రచ్చబండలో సీఎం హామీ ఇచ్చారని..
ఇప్పటి వరకూ ఆ హామీని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో 10
వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారని.. ఆయన మరణం తర్వాత పథకాలను ఈ ప్రభుత్వం
నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయితేనే పేదల కష్టాలు
తొలిగిపోతాయని ఎమ్మెల్యే ఆళ్లనాని అన్నారు.