హైదరాబాద్
: చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం ఉదయం వైఎస్
విజయమ్మ కలిశారు. పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను నేడు
విడుదల చేయనున్న నేపథ్యంలో విజయమ్మ ఈ సందర్భంగా జగన్ తో భేటీ అయ్యారు.
పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ సలహాలు, సూచనలతో ఈ మధ్యహ్నం తర్వాత
కార్యచరణను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.