షర్మిల పాదయాత్రపై చేసిన విమర్శలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ మాజీ
చైర్మన్ గోనె ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ రాజకీయ అనుభవం
లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ వైఎస్ఆర్ను
విమర్శించడం సరికాదన్నారు. వైఎస్ ఉన్నప్పుడు పొగిడిన మందకృష్ణ నేడు
విమర్శించడం అవకాశవాదమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలను బహిర్గతం
చేసి.. ప్రభుత్వాన్ని నిలదీయడానికే మహానేత కూతురు హోదాలో షర్మిల పాదయాత్ర
చేయబోతున్నారని గోనె ప్రకాశ్రావు అన్నారు.