Saturday, 13 October 2012

[YSR Congress Party] వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశం

హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ భేటీ గురువారమిక్కడ మొదలైంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి సంబంధించి భవిష్యత్‌ కార్యచరణ ప్రణాళికను కాసేపట్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. 

నిత్యం ప్రజా సమస్యలపై ప్రజల్లో ఉండే పోరాడాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు లోటస్ పాండ్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.