Sunday, 7 October 2012

ktrao[YSR Congress Party] జగన్ బెయిల్ నిరాకరణ సై సర్వే వివరాలు

ముఖ సంస్థ సర్వే చేసిందని , వచ్చిన పలితాలు ఆసక్తికరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సర్వే వివరాలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభిమానుల మధ్య ప్రచారం అవుతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ కు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సమర్ధిస్తారా అని అడిగితే కేవలం ఇరవై మూడు శాతం మంది మాత్రం సమర్ధించగా, మిగిలిన డెబ్బైరెండు శాతం మంది సమర్ధించలేదు. మిగిలిన ఐదు శాతం ఎటూ తేల్చలేదు. కాగా ఇందులో కూడా ప్రాంతాల వారీగా కూడా ఫలితాలు వచ్చాయి. ఆంధ్ర ప్రాంతంలో సుప్రింకోర్టు నిర్ణయాన్ని పదమూడు శాతం మందే సమర్ధించారు. ఎనభై ఒక్క శాతం మంది సుప్రింకోర్టు నిర్ణయం సమంజసం కాదని అన్నారు.రాయలసీమలో అయితే జగన్ కు మద్దతు మరీ అదికంగా ఉంది. కేవలం ఆరు శాతం మంది మాత్రమే సుప్రింకోర్టు వైఖరికి మద్దతు ఇవ్వగా, 91శాతం మంది వ్యతిరేకించారు.తెలంగాణ లో మాత్రం జగన్ కు మెజార్టీ ఉన్నా, మిగిలిన ప్రాంతాలతో పోల్చితే కాస్త తక్కువే. సుప్రింకోర్టు తీర్పును ముప్పై రెండు శాతం సమర్దించగా, అరవై మూడు శాతం మంది వ్యతిరేకించారు. మొత్తం మీద సీమాంధ్రలో జగన్ హవా లేదా సానుభూతి కొనసాగుతోంది. ఇది తెలంగాణలో కూడా క్రమేపి పెరుగుతోందన్నది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వాదనగా ఉంది.