హైదరాబాద్
: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి
సావిత్రమ్మ మరణం పట్ల పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రగాఢ
సంతాపం వ్యక్తం చేశారు. సావిత్రమ్మ మరణ వార్త తెలుసుకున్న విజయమ్మ గురువారం
కృష్ణదాస్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ధర్మాన కుటుంబ సభ్యులకు సానుభూతి
తెలియచేశారు. సావిత్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని విజయమ్మ ఆకాంక్షించారు.
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సావిత్రమ్మ ఈరోజు ఉదయం మరణించిన విషయం
తెలిసిందే.