Friday, 18 May 2012

ముస్లిం సోదరులతో జగన్ సమావేశం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సొంత జిల్లాలో ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. రైల్వేకోడూరులో ఆయన శుక్రవారం ముస్లింలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు వైఎస్‌ జగన్‌కు టోపీ తొడిగి శాలువా కప్పారు. అనంతరం ఆయన అమ్మవారిశాల, గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి ఓబులవారిపల్లె మండలంలో పర్యటనకు బయల్దేరారు.

10.30 గంటలకు ఆర్. రాచపల్లె, 11.45కు వై.కోట, 12.15కు సున్నపురాళ్లపల్లె, 12.45కు చెన్నరాజుపోడులో క్షత్రియులతో సమావేశం, మధ్యాహ్నం 1.30 గంటలకు మంగంపేటలో భోజనం, అనంతరం 2.30 కు కొర్లకుంట, 3.00 గంటలకు ముక్కవారిపల్లె, 4.00 గంటలకు ఓబులవారిపల్లె, సాయంత్రం 5.00 గంటలకు రైల్వేకోడూరు రోడ్‌షోలో వైఎస్ జగన్ పాల్గొంటారన్నారు.