వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు సొంత జిల్లాలో ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. రైల్వేకోడూరులో ఆయన శుక్రవారం ముస్లింలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు వైఎస్ జగన్కు టోపీ తొడిగి శాలువా కప్పారు. అనంతరం ఆయన అమ్మవారిశాల, గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి ఓబులవారిపల్లె మండలంలో పర్యటనకు బయల్దేరారు.
10.30 గంటలకు ఆర్. రాచపల్లె, 11.45కు వై.కోట, 12.15కు సున్నపురాళ్లపల్లె, 12.45కు చెన్నరాజుపోడులో క్షత్రియులతో సమావేశం, మధ్యాహ్నం 1.30 గంటలకు మంగంపేటలో భోజనం, అనంతరం 2.30 కు కొర్లకుంట, 3.00 గంటలకు ముక్కవారిపల్లె, 4.00 గంటలకు ఓబులవారిపల్లె, సాయంత్రం 5.00 గంటలకు రైల్వేకోడూరు రోడ్షోలో వైఎస్ జగన్ పాల్గొంటారన్నారు.
10.30 గంటలకు ఆర్. రాచపల్లె, 11.45కు వై.కోట, 12.15కు సున్నపురాళ్లపల్లె, 12.45కు చెన్నరాజుపోడులో క్షత్రియులతో సమావేశం, మధ్యాహ్నం 1.30 గంటలకు మంగంపేటలో భోజనం, అనంతరం 2.30 కు కొర్లకుంట, 3.00 గంటలకు ముక్కవారిపల్లె, 4.00 గంటలకు ఓబులవారిపల్లె, సాయంత్రం 5.00 గంటలకు రైల్వేకోడూరు రోడ్షోలో వైఎస్ జగన్ పాల్గొంటారన్నారు.



కడప, న్యూస్లైన్: జన హోరుతో రైల్వేకోడూరు నియోజకవర్గం హోరెత్తింది. మహానేత తనయుడు వైఎస్ జగన్కు ప్రజలు నీరాజనం పట్టారు. ప్రజల అభిమానానికి పులకించిపోయిన జగన్.. ప్రతి అక్కా చెల్లి, అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరించారు. తమ అభిమాన నేతను చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా జనం ఎదురుచూశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం పెనగలూరు మండలం కొండూరులో మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ నివాసం నుంచి వైఎస్ జగన్ బయలుదేరారు. తిరుణం పల్లి, సిరివరం, ఎన్ఆర్ పురం మీదుగా పెనగలూరుకు చేరుకున్నారు.
ప్రచారంలో ప్రతి పల్లెవాసులను జగన్ తమకు అండగా నిలవాలని కోరారు. ప్రజలు, రైతన్నల కోసం అండగా నిలిచి, వారి కోసం పదవీ త్యాగం చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే కొరుముట్లకు సెల్యూట్ చేశారు. కొరుముట్లపై అందరూ చల్లని ఆశీర్వాదాలు చూపి దీవించాలని, ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. చిట్వేలి వైఎస్సార్ సర్కిల్లో జరిగిన ప్రచారం అనంతరం మాజీ ఎమ్మెల్యే గుంటి ప్రసాద్ జగన్ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు.
