ఢిల్లీ
గ్యాంగ్ రేప్ ఘటనపై పీసీసీ చీఫ్ బొత్స చేసిన వాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ మహిళా
విభాగం నేతలు మండిపడ్డారు. బొత్స నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్
సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి హెచ్చరించారు. బొత్స
వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ సాయంత్రం వైఎస్ఆర్ సీపీ
ఆధ్వర్యంలో బొత్స దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం చేపట్టనున్నట్టు మహిళా
విభాగం వెల్లడించింది.