Tuesday, 11 December 2012

[YSR ] కొత్తూరు తండా నుంచి షర్మిల పాదయాత్ర

మహా ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగం షర్మిల మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు తండా నుంచి యాత్రను ప్రారంభించారు. యాత్ర కొడిచెర్ల గ్రామం మీదుగా రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించి కోళ్లపడకల, దుబ్బచెర్ల, పెండ్యాల క్రాస్, మాన్‌సాన్‌పల్లి క్రాస్‌లో బహిరంగ సమావేశం అనంతరం మాన్‌సాన్‌పల్లి గ్రామశివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్‌లో షర్మిల బస చేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 6.2 కిమీ, రంగారెడ్డి జిల్లాలో 10.3 కిలోమీటర్లు.... మొత్తం16.5 కిలోమీటర్ల మేర షర్మిల యాత్ర కొనసాగనుంది.