Tuesday, 30 October 2012

[YSR Congress Party] క్యాబినెట్‌లో ఆంధ్రకు పెద్దపీట వేసిన వైనంపై సామ్నా సంపాదకీయం

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తట్టుకునే లక్ష్యంతోనే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపీట వేశారా! అవుననే అంటోంది సామ్నా సంపాదకీయం.
ముంబై: కేంద్ర మండలిలో ఆంధ్ర ప్రదేశ్‌కు పెద్ద పీట వేయడం వెనుక కారణం.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనడమేనని శివసేన అధినేత బాల్ ఠాక్రే  అభిప్రాయపడ్డారు. సామ్నా దినపత్రిక   దినపత్రిక సంపాదకీయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. క్యాబినెట్ విస్తరణపై ఠాక్రే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సామ్నాతోపాటు మహారాష్ట్రలోని దాదాపు అన్ని ప్రముఖ మరాఠీ దినపత్రిక ల సంపాదకీయాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. జగన్, తెలంగాణ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రి మండలిలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రాధాన్యతనిచ్చారని ఆ పత్రికలు పేర్కొన్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకే చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని ఠాక్రే తన సంపాదకీయంలో అభిప్రాయపడ్డారు. ఈ అంశాల వల్ల జగన్‌ ప్రభావాన్ని తగ్గించడంలో  పెద్దగా ఫలితం చూపకపోవచ్చునని తెలిపారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపునకు చెందిన ‘లోక్‌సత్తా’ దినపత్రిక కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. వైయస్ మరణానంతరం ఆయన కుమారుడైన జగన్‌కి కాంగ్రెస్ సరైన ఆదరణ ఇవ్వలేదనీ, ఈ కారణంగానే ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారనీ వివరించింది. ఆయన్ని ఎదుర్కొనేందుకు దర్యాప్తుల పేరుతో జైలులో కూడా పెట్టించారని పేర్కొంది. మరోవైపు తెలంగాణ అంశంపై కూడా కాంగ్రెస్ ఎటూ తేల్చలేకపోయిందనీ జగన్, తెలంగాణ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ కు క్యాబినెట్‌లో కాంగ్రెస్ పెద్ద పీట వేసిందనీ  లోక్‌సత్తా పత్రిక పేర్కొంది.

[YSR Congress Party] ముగిసిన షర్మిల 13వ రోజు పాదయాత్ర

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల 13వ రోజు మరో ప్రస్థానం పాదయాత్ర ముగిసింది. ఈ రోజు ఆమె 12.9 కిలో మీటర్ల మేర నడిచారు. ఇప్పటి వరకు ఆమె 176.3 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కొమ్మూరు క్రాస్ వద్ద ఈ రాత్రికి బస చేస్తారు.

[YSR Congress Party] 'ఉరవకొండ'లో షర్మిలకు ఘనస్వాగతం


అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జన్మోహన రెడ్డి సోదరి షర్మిల మరో ప్రస్థానం పాదయాత్ర ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పార్టీ నేతలు వై.విశ్వేశ్వర రెడ్డి, వై.మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. రాచానపల్లి వద్ద రూట్స్ పబ్లిక్‌ స్కూల్ విద్యార్థులతో షర్మిల ముచ్చటించారు.

[YSR Congress Party] 'రాష్ట్రంలో ఇక జగన్ దే హవా'


వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు చూస్తుంటే త్వరలోనే ఎన్నికలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయని సీనియర్ అనలిస్టు అమర్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి రావాల్సిన చేరికలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చేరడం.. ఆ పార్టీకి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతున్నాయని ఆయన మంగళవారం సాక్షి హెడ్‌లైన్‌షోలో అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రంలో అధికారపక్షం, ప్రతిపక్షాన్ని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు పెరగడం జగన్‌ ప్రజాపక్షం అనే భావన ప్రజల్లో ఏర్పడిందని ఆ పార్టీ నేత గట్టు రాంచంద్రరావు అన్నారు. టీడీపీలోనూ మెజార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారంటే ఆ పార్టీలో భవిష్యత్తు అధికారం అన్న సూచనలు కనిపిస్తున్నాయి బిజెపి వ్యాఖ్యానించింది.

[YSR Congress Party] 'టీడీపీని ఆ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడంలేదు'

నెల్లూరు: తెలుగుదేశం పార్టీని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే నమ్మడం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ త్వరలో టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు రానున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, త్వరలోనే ఆ పార్టీ కార్యాలయం మూసేసుకోవడం ఖాయమని ఆయన అన్నారు.

[YSR Congress Party] రానున్నది రాజన్న రాజ్యమే!


వివిధ రాజకీయ పార్టీల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలూ, మాజీలూ వచ్చిచేరడం చూస్తుంటే, రాష్ట్రంలో ఇక రానున్నది వైఎస్ జగన్ పాలనేనని తేలిపోతోందని మీడియా ప్రకటిస్తోంది. జగనన్న రాజ్యమంటే, రైతన్న రాజ్యమేనని పాదయాత్ర చేస్తున్న షర్మిల స్పష్టం చేశారు. ‘సూర్యోదయాన్ని ఎలా ఆపజాలరో, అలాగే జగనన్న రాజ్యంలోకి రాకుండా కూడా ఎవ్వరూ ఆపజాల’రని ఆమె అనంతపురంలో పాదయాత్ర చేస్తూ ప్రకటించారు. రేపు జరిగే ఎన్నికల తర్వాత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద మూడో పార్టీగా ఆవిర్భవించడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి -ఈ యాత్రలో పాల్గొంటూనే- ఉద్ఘాటించారు. అసలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే జగన్ ప్రభంజనం వీస్తోందన్న వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు. ప్రాణాలకు తెగించి మరీ, పాదయాత్ర చేపట్టడం చూస్తేనే ఆయన -వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనివార్యమని బెదిరిపోయినందువల్లనే- ఇంతటి ‘సాహస యాత్ర’కు తెగించాడని అర్థమయిపోతుంది.

ఇహనిప్పుడు రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి వంతు వచ్చినట్లుంది. ఆయన కూడా పాదయాత్ర పల్లవి ఎత్తుకున్నారు. నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి హంద్రీ నీవా సుజల స్రవంతి పథకాన్ని మహానేత వైఎస్‌ఆర్ చేపట్టారన్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం, మరో 45 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే ఆ పథకం పూర్తవుతుంది. ఆ పని చెయ్యకుండా, మంత్రిగారు పాదయాత్ర చేసి ఈ పథకాన్ని పూర్తి చేస్తామంటున్నారు. షర్మిల చెప్పినట్లు ఈ వ్యవహారం ‘సొమ్మొకడిది- సోకొకడిది అన్న చందంగానే’ ఉంది! 

మహానేత, ఆయన కుటుంబ సభ్యులూ నెలల తరబడి ప్రజల్లో తిరిగి సంపాదించుకున్న ప్రజాపునాది చూసి టీడీపీ- కాంగ్రెస్ అపవిత్ర కూటమి నేతలు కూడా యాత్రలకు తెగించారంతే. నిజానికి వాళ్ల ప్రకటిత లక్ష్యాలు సాధించాలంటే, ఇంతలేసి సాహసాలు చెయ్యనవసరం లేదు. చంద్రబాబు పాదయాత్రలూ చెయ్యనక్కర్లేదు- వెన్నువిరుచుకోనూ అక్కర్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కూల్చేయాలని ఆయనకు నిజంగానే ఉంటే, టీడీపీ నేతకు అది చిటికెలో పని. తన పార్టీ తరఫున అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే సరి! వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ తీర్మానానికి మద్దతిస్తామని వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల చెప్తూనే ఉన్నారు. కానీ. తేలికగా దొరికే ఈ పరిష్కారాన్ని కాకుండా అసాధ్యమయిన మార్గాన్ని చంద్రబాబు ఎంచుకోవడం చూస్తే అసలాయనకు కిరణ్ సర్కారును కూల్చే ఉద్దేశమే లేదేమో అనిపిస్తుంది.

రఘువీరా రెడ్డి కూడా కేవలం 45 కోట్ల రూపాయలతో పూర్తికాగల హంద్రీ నీవా పథకానికి ఆ మొత్తాన్ని కేటాయింప చేసుకునేందుకు ప్రత్నించడమే లేదు. రాష్ట్ర మంత్రిగా ఉన్న వాడి ముందుండే సులభ సాధ్యమయిన పరిష్కారం ఇది. కానీ దాన్ని వదిలిపెట్టి, ప్రతిపక్ష నేతల మాదిరిగా పాదయాత్ర మొదలుపెట్టడం చూస్తే అసలు మంత్రిగారికి పథకాన్ని పూర్తిచేయించుకోవాలని ఉందా? అనే అనుమానం రావడం సహజం. అయినా, టీడీపీ- కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కుమ్మక్కయి నేర్చుకున్నది ఒక్కటే విద్య. ప్రజా సమస్యల పేరుచెప్పి స్వార్థ ప్రయోజనాలు గడుపుకోవడం! దానికి అందమయిన గిఫ్ట్ ప్యాక్‌గా పాదయాత్రలను వాడుకుంటున్నారంతే! సీబీఐని వాడుకుని వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టించిన కాంగ్రెస్ అధిష్టానమ్మ, ఆయనకు బెయిల్ రాకుండా నానాపాట్లూ పడుతోంది. ఒక్కసారి వైఎస్ జగన్ బయటికొస్తే, ఆయన పూర్తికాలం ప్రజల్లోనే ఉండి, మహానేత ల క్ష్యాలను సంపూర్ణం చేసేందుకు పోరాడతాడని అధిష్టానమ్మ బెదురుతోంది. చంద్రబాబు నాయుడిదీ అదే భయం. అదే వాళ్లిద్దరినీ కలిపింది. అయితే, రాజకీయాల్లో ఇలాంటి అపవిత్ర కూటములు విజయం సాధించిన దాకల ఎక్కడా కనిపించదు. సామాన్య ప్రజానీకం ఎల్లెప్పుడూ గెలిపించేది విశ్వసనీయత కలిగిన నేతనే. అటు అధిష్టానమ్మకు గానీ, ఇటు చంద్రబాబు నాయుడికి గానీ కరువయినదీ విశ్వసనీయతే!

కోటి ఎకరాలకు నీరివ్వాలన్న మహానేత స్వప్నం సాకారం చెయ్యాలన్నదే తన ఎజెండా అని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతిని షర్మిల తన పాదయాత్ర సందర్భంగా అనేక సందర్భాల్లో గుర్తు చేశారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి నూటికి డెబ్బయ్ మందికి జీవన భృతిని కల్పిస్తూన్న ఆ రంగాన్ని నిలబెట్టాలన్న లక్ష్యాన్ని సాధించడమే తన ప్రణాళిక అని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతిని షర్మిల జ్ఞాపకం చేశారు. మూడువేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ప్రవేశపెట్టి రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న మహానేత కలను నిజంచెయ్యడమే తన కర్తవ్యమని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతిని షర్మిల తన ప్రసంగాల్లో గుర్తు చేశారు. రైతులకూ మహిళలకూ వడ్డీలేని రుణాలిప్పించడమే తన లక్ష్యమని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతిని షర్మిల ప్రస్తావించారు. వైఎస్ జగన్‌కు విశ్వసనీయతను సంపాదించి పెడుతున్న విషయాలివే. ఈ లక్ష్యాలే వైఎస్ జగన్ విజయాన్ని అనివార్యంగా మారుస్తున్నాయి. 

[YSR Congress Party] షర్మిల 13వరోజు మరో ప్రజాప్రస్థానం

 వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 13వ రోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

షర్మిల పిల్లిగుండ్ల కాలనీ, నీనం రాజశేఖర్ రెడ్డి నగర్, సిండికేట్ నగర్ మీదగా మధ్యాహ్నానికి రూట్ పబ్లిక్ స్కూల్ వరకు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం రాచానపల్లి, ఉరవకొండ నియోజకవర్గం లెప్రసీ కాలనీ మీదగా బొద్కూరు క్రాస్, బ్రాహ్మణపల్లి, కమ్మూరు క్రాస్ చేరుకుంటారు. ఆమె కమ్మూరులో రాత్రికి బస చేస్తారు.

[YSR Congress Party] ఉరవకొండ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర ఇలా...


అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ఉరవకొండ నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆరు రోజుల పాటు కొనసాగుతుందని ఆ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి, సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. 
31న బుధవారం కమ్మూరు క్రాసు అగ్రిగోల్డ్ ఫంక్షన్‌హాల్ నుంచి ప్రారంభమై అరవకూరు, కూడేరు సరిహద్దుల్లో మధ్యాహ్నం విరామం, కూడేరులో బహిరంగసభ, ముద్దలాపురం గ్రామ సమీపంలో రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. మొత్తం 12 కిలోమీటర్లు నడుస్తారు. 

- నవంబర్ 1న ముద్దలాపురం, వైఎస్సార్ వాటర్ ప్రాజెక్టు సందర్శన, తరువాత మధ్యాహ్న విరామం, అక్కడి నుం చి జల్లిపల్లిలో బహిరంగసభ, ఉదిరిపికొండ, శివరాంపేట మీదుగా భంభంస్వామి గుట్ట దగ్గర రాత్రి విరామం. ఆ రోజు మొత్తం 13 కిలోమీటర్లు. 

- 2న పెన్నహోబిలం పీఏబీఆర్ కాలవ పరిశీలన, కోనాపురం క్రాసు, మధ్యాహ్నం విరామం, షెక్షాన్‌పల్లిలో బహిరంగ సభ, అక్కడి నుంచి లత్తవరం సరిహద్దుల్లో రాత్రి విరామం. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్లు. 

- 3న లత్తవరం, ఉరవకొండ పోలీసు స్టేషన్ ఎదురుగా మధ్యాహ్నం విరామం, తర్వాత ఉరవకొండ టౌన్, ఇందిరానగర్, పాత స్టేట్‌బ్యాంకు, పార్కు ఆం జనేయస్వామి వీధి, పెద్దమసీదు ఏరియా, ఆర్యవైశ్య వీధి, గాంధీ విగ్రహం సర్కిల్ , బ్రాహ్మణవీధి, పంచాయతీ ఆఫీసు మీదుగా పాత బస్టాండు వద్ద గొప్ప బహిరంగ సభ. మార్కెట్ యార్డు వద్ద రాత్రి విరామం. ఆ రోజు మొత్తం 10 కిలోమీటర్లు. 

- 4న గాలిమర్ల సర్కిల్ దగ్గర మధ్యా హ్న విరామం, పీసీ ప్యాపిలి క్రాస్, కడమలకుంట క్రాస్, హంద్రీనీవా కాలువ పరిశీలన, రాగులపాడు గ్రామంలో బి హరంగ సభ, రాత్రి అక్కడే బసచేస్తారు. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్లు. 

- 5న పందికుంట, తట్రకల్లు గ్రామ సరిహద్దులో మధ్యాహ్న విరామం, తట్రకల్లు, గంజికుంట, వజ్రకరూరు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. ఆ రోజు మొత్తం 11 కిలోమీటర్లు.

- 6న కమలపాడు క్రాసు, కమలపాడు గ్రామ సరిహద్దుల్లో మధ్యాహ్న విరామం, గూళ్యపాల్యం, కొనకొండ్లలో బహిరంగ సభ. అనంతరం గుంతకల్లు నియోజకవర్గంలో భీమా గార్డెన్స్‌లో రాత్రి విరామం. ఆ రోజు మొత్తం 12.5 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగిస్తారు.

[YSR Congress Party] జగన్‌ను ఎదుర్కొనేందుకే ఏపీకి పెద్దపీట: బాల్‌ఠాక్రే


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకే కేంద్ర మంత్రిమండలిలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద పీట వేశారని శివసేన అధినేత బాల్ ఠాక్రే తెలిపారు. సోమవారం సామ్నా దినపత్రిక సంపాదకీయంలో కేబినెట్ విస్తరణపై ఠాక్రే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సామ్నాతోపాటు మహారాష్ట్రలోని దాదాపు అన్ని ప్రముఖ మరాఠీ దినపత్రిక ల సంపాదకీయాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. జగన్, తెలంగాణ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి మండలిలో ఏపీకి ప్రాధాన్యతనిచ్చారని ఆ పత్రికలు పేర్కొన్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకే చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చారని ఠాక్రే చెప్పారు. అయితే ఈ అంశాలు జగన్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌నకు చెందిన ‘లోక్‌సత్తా’ దినపత్రిక కూడా ఇదే విధంగా అభిప్రాయపడింది. ‘‘వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడైన జగన్‌కి కాంగ్రెస్ సరైన ఆదరణ ఇవ్వలేదు. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆయన్ని ఎదుర్కొనేందుకు దర్యాప్తుల పేరుతో జైలులో కూడా పెట్టించారు. మరోవైపు తెలంగాణ అంశంపై కూడా కాంగ్రెస్ ఎటూ తేల్చలేకపోయింది. జగన్, తెలంగాణ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పెద్ద పీట వేసింది’’ అని లోక్‌సత్తా పత్రిక పేర్కొంది. 

[YSR Congress Party] అనంతలో టీడీపీకి షాక్: భారీగా వైస్సార్సీపీలోకి నేతలు


అనంతలో టీడీపీకి షాక్: భారీగా వైస్సార్సీపీలోకి నేతలు

అనంతపురం, న్యూస్‌లైన్: ‘ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఉన్న తాను ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది’అని అనంతపురంలో సోమవారం షర్మిల సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, శింగనమల మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేసిన తరిమెల. తో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారికి పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా తరిమెల మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే సత్తా కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇదే సభలో పుట్టపర్తి నియోజకవర్గం నాయకుడు డాక్టర్ సి.సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తచెరువు మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యులు, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు, నగరానికి చెందిన టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పి.నూర్‌జాన్, మరికొందరు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సభలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

[YSR Congress Party] వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు


విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరిక 
మాజీ ఎమ్మెల్యే చెంగలతో పాటు విశాఖ టీడీపీ నేతలదీ అదే బాట

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వివిధ రాజకీయపక్షాల నేతల చేరికలు ఊపందుకున్నాయి. ప్రజా సమస్యల పట్ల పాలక, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆయా పార్టీల నేతలు ప్రజాపక్షంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు నేతలు పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి.జి.కుమార్ (మాడుగుల), భూపతిరాజు అచ్యుతరామరాజు (భీమిలి), డాక్టర్ పోలిశెట్టి సునీతిలతో పాటు పెద్ద సంఖ్యలో వారి అనుచరులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, పెన్మత్స సాంబశివరాజు, జ్యోతుల నెహ్రూ, ఎం.మారెప్ప, ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, టి.బాలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మూడేళ్లుగా ఎంతో బాధపడ్డా: ‘‘మహానేత వైఎస్ చరిష్మా వల్లే నేను ఎమ్మెల్యేగా గెలిచా. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని నాకు టికెట్ ఇచ్చి నేరుగా అసెంబ్లీకి పంపించారు. అలాంటి కుటుంబానికి మూడేళ్లు దూరంగా ఉన్నందుకు చాలా బాధగా ఉంది. ఈ క్షణం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తా’’ అని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మద్దాల రాజేష్ చెప్పారు. వైఎస్ మరణం జీర్ణించుకోలేని వారిలో తాను కూడా ఒకడినని అన్నారు. ఆయన మరణించి మూడేళ్లు అవుతున్నా ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని కోరుకున్న వారిలో తానూ ఉన్నానని, కొన్నాళ్లపాటు ఆయన వెంట నడిచిన ప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి దృష్ట్యా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పారు. ‘‘వెనుకబడిన చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గకూడదని వైఎస్ చెప్పేవారు. ఆ మహానేత మాటను నెరవేర్చడం కోసమే మూడేళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గాన్ని రూ.200 కోట్ల విలువైన పనులతో అభివృద్ధి చేయగలిగా’’ అని వివరించారు. ఇన్నాళ్లూ వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నందుకు చాలా బాధపడినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లేఖను స్పీకర్‌కు పంపనున్నట్లు ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

బాబూ టీడీపీని కాంగ్రెస్‌లో కలిపేయండి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై చెంగల వెంకట్రావ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టని చంద్రబాబు, ప్రజలకు అండగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు, కుతంత్రాలు చేసేందుకు చీకట్లో చిదంబరంను కలుస్తారని దుయ్యబట్టారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం చేతకాకపోతే చిరంజీవి మాదిరిగా చంద్రబాబు కూడా టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు వేరుగా లేవని, రెండూ కలగలిసి ప్రజాసమస్యలను గాలికొదిలేశాయని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదల గుండెల్లో నాటుకుపోయాయన్నారు. ‘‘ఈరోజు ప్రజలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉన్నారు. మళ్లీ వైఎస్ సువర్ణయుగం కోసం జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు డిసైడయ్యారు’’ అని చెంగల పేర్కొన్నారు. చెంగలతో పాటు పెద్ద ఎత్తున నేతల చేరికతో విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ మరింత బలోపేతమవుతోందని ఎమ్మెల్యే బాబురావు స్పష్టం చేశారు.

పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి

వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, కె.కె.మహేందర్‌రెడ్డి, బాలమణెమ్మ, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావులతోపాటు వాల్మీకి సంఘం నేతలు కె.సత్యరాజు, బండి శివ, గోపాల్, బోయ రమేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

[YSR Congress Party] షర్మిల వెంట ‘అనంత’ జనవాహిని


12వ రోజు పాదయాత్రలో భాగంగా షర్మిల అనంతపురం ఎస్కేయూ నుంచి సోమవారం ఉదయం పది గంటలకు పాదయాత్రకు బయలుదేరారు. ఉదయం నుంచే అనంతపురం ప్రజలు పెద్ద ఎత్తున ఆమె వెన్నంటి ఉన్నారు. వేలాది మంది ఆమెతో కదం కలిపారు. వీధులన్నీ పోటెత్తగా షర్మిల ముందుకు సాగారు. మార్గమధ్యలో చియ్యేడుకు చెందిన రైతులు తాము కూలీలుగా మారిన పరిస్థితిని ఆమె దృష్టికి తెచ్చారు. నీరు లేక, కరెంటు లేక, పంటలు పండక, నష్టపరిహారం రాక ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం 11.20కి విన్సెంట్ పాఠశాలలో పిల్లలకు అభివాదం తెలిపి పాదయాత్ర కొనసాగించారు. తర్వాత ఇటుక బట్టీ కార్మికులతో మాట్లాడారు. షర్మిల ఇటుక మూసలో మట్టి పోసి రెండు మూడు ఇటుకలు తయారు చేశారు. మధ్యాహ్నం 12.15కు ఆర్డీటీ ఆసుపత్రి సమీపంలో భోజన విరామానికి ఆగారు. తిరిగి 3.30కు పాదయాత్రకు బయలుదేరారు. 4.45కు వాల్మీకి విగ్రహానికి హారతి ఇచ్చి, అక్కడ్నుంచి బహిరంగ సభ ప్రాంతమైన సప్తగిరి సెంటర్‌కు సాయంత్రం 5.15కు చేరుకున్నారు. అనంతపురం నగరమంతా అక్కడికి తరలిరావడంతో మెయిన్ రోడ్డు అంతా ట్రాఫిక్ జామైంది. యువతీయువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మైనారిటీ సోదరులు బంతిపూల తివాచీ పరిచి స్వాగతం పలికారు. రాత్రి 7.35 గంటలకు కల్యాణదుర్గం బైపాస్ రోడ్డులో రాత్రి బసకు చేరుకున్నారు. పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.

[YSR Congress Party] జగన్ తెలంగాణకు వ్యతిరేకి కాదు: జిట్టా

జగన్‌తోనే వైఎస్ పథకాల అమలు సాధ్యం

భువనగిరి (నల్లగొండ), న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం కాదని సోమవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో పార్టీలో చేరిన యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి చెప్పారు. పార్టీ మొదటి ప్లీనరీలోనే జగన్ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పేరుతో పబ్బం గడుపుకుంటున్న టీఆర్‌ఎస్ అధినేత, వారి కుటుంబసభ్యులు కాంగ్రెస్‌తో చేసుకున్న చీకటి ఒప్పందాలను వెల్లడించాలని జిట్టా డిమాండ్ చేశారు.

మహానేత వైఎస్‌ఆర్ రాష్ట్రంలోని ప్రతిఒక్కరి గుండెల్లో ఉన్నారని, ఆయన చేపట్టిన పథకాలు ప్రతి ఒక్కరికీ అందాయని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ పథకాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. వైఎస్ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ పదవి కాపాడుకుంటున్నారని, చంద్రబాబుతో కుమ్మక్కై అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇస్తున్న ప్రాముఖ్యత ప్రజా సమస్యలకు ఇవ్వడం లేదన్నారు. షర్మిలమ్మ పాదయాత్ర తెలంగాణకు చేరుకునేలోగానే జగన్ జైలు నుంచి విడుదలై పాదయాత్రను పూర్తి చేస్తారని జిట్టా చెప్పారు. తెలంగాణలో 70 నుంచి 80 సీట్లు వైఎస్‌ఆర్‌సీపీ సాధించడం ఖాయమన్నారు.

టీఆర్‌ఎస్‌ను నామరూపాల్లేకుండా చేయాలి: సురేఖ

వచ్చే 2014 ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ మార్చ్ విజయవంతం కావడంతో తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై విశ్వాసం పోయిందన్నారు. 11 ఏళ్లుగా కేసీఆర్ దొంగమాటలు చెపుతున్నారని, ఆ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. పరకాల ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్‌ఎస్ నేతలు గ్రామాల్లో తిష్ట వేసి అహర్నిశలు పాటుపడ్డారని, అయినా ప్రజలు వారికి ముచ్చెమటలు పట్టించారని చెప్పారు. అక్కడ నైతిక విజయం తనదేనని సురేఖ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ నాయకత్వాన్ని బలపరచాలని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు 25 వేల కిలోమీటర్లు నడిచినా ప్రజలు ఆయనను నమ్మరని చెప్పారు. ప్రజాభిమానం కలిగిన జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ విజయం ఖాయమని చెప్పారు.

ఎవరి పాపాలనో జగన్‌పై రుద్దుతున్నారు: ఉప్పునూతల

ఎవరో చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌పై రుద్దుతోందని మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అన్నారు. వైఎస్ వారసునిగా జగన్ నిరంతరం ప్రజల్లో ఉన్నారని చెప్పారు. పరకాలలో కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై కొండా సురేఖను ఓడించాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఉప్పునూతల చెప్పారు. జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని ఆయన అన్నారు. 

[YSR Congress Party] జగనన్నతోనే రైతన్న రాజ్యం

కోటి ఎకరాలకు నీరివ్వాలన్న వైఎస్ కలను సాకారం చేస్తాడు
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది
రైతన్న గిట్టుబాటు ధరకోసం రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి
రాజన్నకు, జగనన్నకు ఉన్నది.. చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత
చంద్రబాబుకు ప్రభుత్వాన్ని దించే శక్తి ఉన్నా.. ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదు?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 12, కిలోమీటర్లు: 163.4


మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఒకరోజు వస్తుంది. ఎలాగైతే ఉదయించే సూర్యుడిని ఆపలేమో జగనన్నను కూడా ఆపలేరు. ఆరోజు జగనన్న బయటకు వస్తాడు. మనందరినీ రాజన్న రాజ్యం దిశగా తీసుకెళతాడు. రైతన్న రాజ్యం స్థాపిస్తాడు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ఉద్ఘాటించారు. కోటి ఎకరాలకు నీరివ్వాలన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలను జగనన్న సాకారం చేస్తాడని చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి, రైతన్న గిట్టుబాటు ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాడని పేర్కొన్నారు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తాడని అన్నారు. 

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 12వ రోజు సోమవారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘‘జగనన్న అధికారంలోకి వస్తే పెద్ద చదువులకు ఇక ఆటంకం ఉండదు. ప్రతి మహిళా తన పిల్లలను బడికి పంపేందుకు వీలుగా ‘అమ్మ ఒడి’ ద్వారా తల్లి బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ.500, ఇంటరైతే రూ.700, డిగ్రీ అయితే రూ.1,000 వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 పింఛన్ ఇస్తాడు. రాజన్న చెప్పినవీ చేశాడూ.. చెప్పనివీ చేశాడు. జగనన్న కూడా మాట మీద నిలబడే మనిషి. చెప్పినవే కాకుండా ప్రజల అవసరాలను గమనించి అన్నీ సమకూరుస్తాడు. మైనారిటీలకు వీలైనంత ప్రయోజనం కల్పించాలన్నదే వైఎస్ లక్ష్యం. అదే లక్ష్యంతో జగనన్న పనిచేస్తాడు..’’ అని చెప్పారు.

చంద్రబాబుకు లేనిది.. విశ్వసనీయత!

రాజన్న, జగనన్నలకు ఉన్నది.. టీడీపీ అధినేత చంద్రబాబుకు లేనిది విశ్వసనీయత, మాటమీద నిలబడే నైజం అని షర్మిల అన్నారు. ‘‘చంద్రబాబుకు అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే శక్తి టీడీపీకి ఉంది. వైఎస్సార్‌సీపీ కూడా మద్దతు ఇస్తామంటున్నా చంద్రబాబు అవిశ్వాసం పెట్టరట. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయి. సీబీఐని వాడుకుని విచారణ పేరుతో జగనన్నను బందీని చేశారు. వారి లక్ష్యం ఒక్కటే. జగనన్న బయటే ఉంటే ప్రతి సమస్యకూ స్పందిస్తాడు. రేయనక పగలనక మీ మధ్య ఉంటాడు. మీ ప్రేమ, ఆప్యాయతలు పొందుతాడు. కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు. ఇలాగైతే తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని వారు జగనన్నను దోషిగా చిత్రీకరించారు. జైల్లో పెట్టారు. కానీ దేవుడున్నాడు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన నిలబడతాడన్నదీ అంతే నిజం. అధర్మానికి ఆయుష్షు తక్కువ’’ అన్నారు.

సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్టుగా ఉంది..

‘‘కరువు జిల్లా అని అనంతపురంపై ప్రత్యేక శ్రద్ధతో రాజన్న హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని 4 వేల కోట్ల రూపాయలతో చేపట్టి 95% పనులు పూర్తిచేస్తే.. ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం 5% కూడా పూర్తిచేయలేకపోయింది. ఇంకో రూ.45 కోట్లు వెచ్చిస్తే మొదటి విడత పనులు పూర్తవుతాయి. ఈ పనుల కోసం మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్ర చేసి పూర్తి చేస్తారట. సొమ్మొకరిది.. సోకొకరిది అన్న చందంగా ఉంది ఆయన కథ. పోనీలెండి. ఆ పనులైనా పూర్తిచేస్తే సంతోషమే..’’ అని షర్మిల విమర్శించారు.

కేంద్రంలో వైఎస్సార్‌సీపీ అతిపెద్ద మూడో పార్టీ: మేకపాటి

బహిరంగ సభలో లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ కారణజన్ముడని పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలు రుద్దే నేతలు మనల్ని పాలించడం సరికాదన్నారు. డిసెంబర్‌లోగా జగన్ బయటికి వస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, ఢిల్లీలో కూడా కాంగ్రెస్, బీజేపీల తరువాత 35 ఎంపీ స్థానాలతో అతి పెద్ద పార్టీ వైఎస్సార్‌సీపీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సప్తగిరి సర్కిల్‌లో జరిగిన సభలో తెలుగుదేశం అనుబంధ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి సమీప బంధువు తరిమెల శరత్‌చంద్రారెడ్డి షర్మిల సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.

[YSR Congress Party] తెలంగాణకు సత్వర పరిష్కారం

ఎవరికి అన్యాయం జరగకుండా సమస్యను పరిష్కరించాలన్నదే జగన్ అభిమతం
వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి
వైఎస్ విజయమ్మకు బ్రహ్మరథం పట్టిన భువనగిరి
రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ కింద
రాష్ట్రాలను విభజించాల్సింది కేంద్రమే!
తెలంగాణలో పేదరికాన్ని వైఎస్ గుర్తించారు..అభివృద్ధికి తపనపడ్డారు
జగన్ బయటకు వస్తారు.. వైఎస్ నాటి సువర్ణయుగం అందిస్తారు
జిట్టా బాలకృష్ణారెడ్డితో పాటు పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిక

భువనగిరి నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిరంతరం తపన పడ్డారని, జలయజ్ఞం మొదలు అనేక పథకాల్లో ప్రాధాన్యత కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. రాయలసీమలో మాదిరిగానే తెలంగాణలోనూ తీవ్ర పేదరికం ఉందని వైఎస్ గుర్తించినట్లు తెలిపారు. తెలంగాణపై జగన్‌బాబు పార్టీ ప్లీనరీలోనే స్పష్టంగా చెప్పారన్నారు. వైఎస్‌తో పాటు జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణకు గానీ, తెలంగాణ ప్రజానీకానికి గానీ ఎన్నడూ వ్యతిరేకం కాదని విజయమ్మ స్పష్టం చేశారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకుండా ఈ సమస్యను పరిష్కరించాలని జగన్ చెప్పారన్నారు.

సోమవారం రాత్రి యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి సహా పలువురు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నల్లగొండ జిల్లా భువనగిరిలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘తెలంగాణ ఇచ్చేవారమూ కాదు, తెచ్చేవాళ్లమూ కాదు, రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ కింద రాష్ట్రాలను విభజించాల్సింది కేంద్రమే! ఈ విషయంలో కేంద్రం చేయాల్సింది సత్వరమే చేయాలి. తెలంగాణలో ఇంతమంది చనిపోయారంటే అందుకు కేంద్రమే బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రజల్లో ఉన్న బలీయమైన ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని తమ పదవులకు రాజీనామాలు చేసిన ఆరుగురు ఎమ్మెల్యేల స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా పెట్టలేదు.

మా పార్టీ స్వార్థపూరిత అవకాశవాద పార్టీ కాదు, విశ్వసనీయత గల పార్టీ. ఉన్నవారు, లేనివారు ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందడం కోసమే వైఎస్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అందులోని చాలా వ్యాధులను తొలగించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చింది’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ తొలి సంతకం చేసిన ఉచిత విద్యుత్ పథకం వల్ల రాష్ట్రం మొత్తం మీద 24 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే ఒక్క తెలంగాణలోనే 14 లక్షల మందికి మేలు జరిగిందని తెలిపారు. అలాగే కరెంటు బకాయిల రద్దు వల్ల అధికంగా తెలంగాణ రైతులకు మేలు జరిగిందన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైఎస్ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.51 వేల కోట్లను ఖర్చు చేస్తే అందులో తెలంగాణ ప్రాజెక్టులకు రూ.20 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ప్రధాని ప్రత్యేక నిధి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో రుణాల రీషెడ్యూలింగ్ చేయించిన విషయం గుర్తుచేశారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణా నది నుంచి మంచినీటిని అందజేయాలనే లక్ష్యంతో పథకాలు చేపట్టి 90 శాతం గ్రామాలకు మేలు చేశారని, మరో పది శాతం గ్రామాలే ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పారు. అలీసాగర్, గుత్ప, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులు వైఎస్ హయాంలో పూర్తయ్యాయని వివరించారు. ఎల్లంపల్లి, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులకు వైఎస్ అన్ని అనుమతులు తేగలిగినా.. ఇప్పటి ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేక పోతోందన్నారు. తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జలసంఘం నుంచి అనుమతులు తెచ్చినా, ఇటీవల మహారాష్ట్ర సంసిద్ధత వ్యక్తం చేసినా దాని నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

బాబు దొంగ మాటలు ప్రజలు నమ్మరు

‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు తిండి సరిగ్గా దొరకని పరిస్థితి. చేద్దామంటే కూలీ కూడా ఉండేది కాదు. వ్యవసాయానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కరెంటు బిల్లులు కట్టలేదని బాబు రైతులను వేధించారు. ప్రత్యేకంగా పోలీసుస్టేషన్లు పెట్టి వారిపై కేసులు పెట్టారు. విద్యుత్ చౌర్యం చేస్తే విదేశాల్లో అయితే ఉరి తీస్తారని, తాను కనుక వారిని జైలుకు మాత్రమే పంపుతున్నానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయం దండుగ అనీ ఆయన అన్నారు. 4 వేల మంది రైతులు ఆయన హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 రూపాయలకు కిలో బియ్యం ధరను 5.15 రూపాయలకు పెంచింది బాబే. సంపూర్ణ మద్య నిషేధం ఎత్తి వేసింది ఆయనే. ఇప్పుడేమో బెల్ట్ షాపులను రద్దు చేస్తానని చెబుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని వైఎస్ కోరితే ‘పరిహారం ఇస్తే ఆ మొత్తం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు’ అని హేళనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చెబుతున్న దొంగమాటలు ప్రజలు ఎంతమాత్రం నమ్మరు. 2009లో టీఆర్‌ఎస్‌తో జత కలిసి ఎన్నికల ప్రణాళికలో కూడా తెలంగాణ అంశం చేర్చి ఇప్పుడు వేరే మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి అవకాశవాదం బాబుకే చెల్లు’ అని విజయమ్మ పేర్కొన్నారు.

వైఎస్ హామీలను తుంగలో తొక్కారు: ‘వైఎస్ రెక్కల కష్టంతో వచ్చిన అధికారంతో రాజ్యమేలుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది. రూ.15 వేల కోట్ల మేరకు సర్‌చార్జి పేరుతో కరెంటు చార్జీలను పెంచింది. ఆడవాళ్లకు ఇబ్బంది కలిగించేలా వంటగ్యాస్ సబ్సిడీని 6 సిలిండర్లకే పరిమితం చేశారు. ఎన్నోసార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచారు. కూరగాయల ధరలు పెరిగాయి.

ఇక పథకాల విషయానికి వస్తే అన్నింటినీ నీరు గార్చారు. బీబీనగర్ వద్ద రూ.86 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ స్థాయిలో నిమ్స్ ఆసుపత్రిని నిర్మిస్తే దానిని ఇప్పటికీ వినియోగించుకోవడం లేదు. తెలంగాణలోని 6 జిల్లాల ప్రజలు ఆధునిక వైద్యం కోసం హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా చేయాలని వైఎస్ అభిలషిస్తే.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. పరకాలలో కొండా సురేఖ ఓటమికి వీరి కుమ్మక్కే కారణం’ అని విజయమ్మ అన్నారు. ఎవరు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఆ దేవుడు ఉన్నాడని, జగన్ బయటకు వస్తారని.. రాష్ట్ర ప్రజలకు వైఎస్ నాటి సువర్ణయుగాన్ని అందిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ బయటకు వచ్చేవరకూ పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి సహా పలువురు నేతలను ఆమె ఆశీర్వదించి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ మంత్రి కొండా సురేఖ, వై.వి.సుబ్బారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, హెచ్.ఎ.రెహ్మాన్, డి.రవీంద్రనాయక్, బీరవోలు సోమిరెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


విజయమ్మకు భువనగిరి నీరాజనం

భువనగిరి నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు భువనగిరి ప్రజలు నీరాజనం పలికారు. బహిరంగ సభ జరిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలతో కిటకిటలాడింది. విజయమ్మ ఉద్వేగపూరితంగా ప్రసంగిస్తున్నపుడు మంచి స్పందన లభించింది. కొండా సురేఖ, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ప్రసంగిస్తున్నపుడు కూడా సభలో ఉత్సాహం ఉరకలు వేసింది. విజయమ్మ రాకకు ముందే జనంతో మైదానం నిండిపోయింది. భువనగిరి పొలిమేరల్లో విజయమ్మ వాహనం ప్రవేశించినప్పటి నుంచే ప్రజలు ఉత్సాహంతో కదం తొక్కారు. ఆమె సభా స్థలికి చేరుకోగానే సమీపంలోంచి చూసేందుకు ఎగబడ్డారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు లేచి నిలబడి విజయమ్మకు దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

‘జై జగన్...జై తెలంగాణ...జోహార్ వైఎస్సార్...’ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు బలమైన కేంద్రంగా ఉన్న భువనగిరిలో విజయమ్మ సభ ఊహించిన దానికన్నా ఎక్కువగా విజయవంతం కావడం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పార్టీ ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద స్థాయిలో జరిగిన తొలి సభలో తెలంగాణ నేతలంతా హాజరు కావడం స్థానిక నేతలకు మంచి ఊపునిచ్చింది. తెలంగాణపై విజయమ్మ విస్పష్టమైన వైఖరిని ప్రకటించినప్పుడు, ఈ స్పష్టతతో సంతృప్తి చెందుతున్నామని జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్కొన్నప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది. తెలంగాణలో దగాపడ్డ బిడ్డలంతా ఇక్కడున్నారంటూ కె.కె.మహేందర్‌రెడ్డి,డి.రవీంద్రనాయక్‌ల పేర్లను జిట్టా ప్రస్తావించినప్పుడు కూడా జనం ఇదే విధంగా స్పందించారు. 

[YSR Congress Party] నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా..

అనంతపురం:మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం నగర శివారులోని కళ్యాణదుర్గం బైపాస్ నుంచి పిల్లిగుండ్ల కాలనీ, నీలం రాజశేఖరరెడ్డి నగర్, సిండికేట్‌నగర్ కాలనీ, రూట్స్ పబ్లిక్ స్కూల్, రాచానపల్లి, లెప్రసీ కాలనీ, గొట్కూర్ క్రాస్, బ్రాహ్మణపల్లి క్రాస్ మీదుగా కమ్మూరు క్రాస్ వరకు సాగనుంది. సోమవారం 11.2 కిలోమీటర్ల దూరం నడిచిన షర్మిల.. మంగళవారం 12.9 కిలోమీటర్ల దూరం నడవనున్నారని వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు.

Monday, 29 October 2012

[YSR Congress Party] 'వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'


కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలను చేసుకున్న నేతలను నిలదీయాలని పరోక్షంగా టిఆర్ఎస్ ను ఉద్దేశించి జిట్టా బాలకృష్ణా రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈరోజు ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ పథకాలు అమలు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.

[YSR Congress Party] ముగిసిన షర్మిల 12వ రోజు పాదయాత్ర

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల మరోప్రస్థానం పాదయాత్ర 12వ రోజు ముగిసింది. ఈ రోజు ఆమె 11.2 కిలో మీటర్లు నడిచారు. ఇప్పటికి ఆమె మొత్తం 162 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఈ రోజు అనంతపురంలో జరిగిన ఆమె పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.

[YSR Congress Party] రావణకాష్టం రాజేశారు : విజయమ్మ

భువనగిరి: రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. కానీ తెలంగాణలో రావణకాష్టం రాజేశారన్నారు. అనేక మంది మరణించారని ఆమె బాధపడ్డారు. తెలంగాణలోని మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. వైఎస్ఆర్ ప్రాణాలు పోయేంతవరకు ఈ ప్రాంతాన్ని ప్రేమించారని చెప్పారు. ఇక్కడి కష్టాలు ఆయనకు తెలుసని, తెలంగాణ వెనుకబాటుని ఆయన గుర్తించారని వివరించారు. ఆయన చేయవలసినంత ఈ ప్రాంతానికి చేశారన్నారు. రాజశేఖర రెడ్డికైనా, జగన్ కైనా తెలంగాణ పట్ల వ్యతిరేకత లేదని చెప్పారు. మనిషిని మనిషిగా ప్రేమించడమే ఆయన నేర్పించారని తెలిపారు. అందరూ కలిసి ఉండాలని వైఎస్ఆర్ ఆశించారని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన వారిపై తమ పార్టీ పోటీ కూడా పెట్టలేదని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే పోటీ పెట్టలేదని చెప్పారు. పార్టీ ప్లీనరీలో కూడా తాము తెలంగాణకు వ్యతిరేకులం కాదని జగన్ స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. 

బాలకృష్ణా రెడ్డితోపాటు పార్టీలో చేరినవారందనినీ విజయమ్మ అభినందించారు.

[YSR Congress Party] 'ఎవరోచేసిన పాపాలను వైఎస్ పై వేశారు'

భువనగిరి: ఎవరో చేసిన పాపాలను దివంగత మహానేత వైఎస్ఆర్ పైన వేశారని ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం మొత్తం మీద ఎన్నికలలో నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో 
భువనగిరి నియోజకవర్గ ఓటర్లు రావి నారాయణ రెడ్డిని గెలిచింపిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా కడపలో భారీ మెజార్టీతో గెలిచారన్నారు. రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు.

[YSR Congress Party] గ్యాస్ ధరను మొదటిసారి పెంచినది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబే


గ్యాస్ ధరను మొదటిసారి పెంచినది టిడిపి అధ్యక్షుడు చంద్రబాబేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. సప్తగిరి సర్కిల్ లో ఈ సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. బాబు పాలనలో వంట గ్యాస్ ధర 145 నుంచి 305 రూపాయలకు పెరిగిందన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో గ్యాస్ ధర అసలు పెరగలేదని గుర్తు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, మద్యపాన నిషేధ పథకాలకు చంద్రబాబు పాతరేశారని విమర్శించారు.

ఈ జిల్లా అంటే వైఎస్ఆర్ కు అభిమానం ఎక్కువని ఆమె చెప్పారు. జలయజ్ఞంలో అనంతపురం జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. హంద్రీ నీవా కోసం వైఎస్ఆర్ జిఓ విడుదల చేస్తే, ఈ ప్రభుత్వం దానిని తొక్కిపెట్టిందన్నారు. ఈ నేతల వల్ల తాగునీరుకు కూడా కష్టమవుతోందన్నారు. ఫీజుల పథకానికి ఈ ప్రభుత్వం పాతరేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కై జగనన్నని వేధిస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టిడిపి ఆ పని చేయడంలేదని చెప్పారు.

[YSR Congress Party] వైఎస్ఆర్ సిపిలో చేరిన జిట్టా బాలకృష్ణా రెడ్డి


భువనగిరి: యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభావేదికపైన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ కండువా కప్పి బాలకృష్ణా రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనం జైజగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సభలో మాజీ మంత్రి కొండా సురేఖ, వైవి సుబ్బారెడ్డి, రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

[YSR Congress Party] భువనగిరిలో విజయమ్మకు ఘనస్వాగతం

భువనగిరి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భువనగిరి చేరుకున్నారు. ఆమెకు కార్యకర్తలు, అభిమానులు మేళతాళాలు, తప్పెట్లతో ఘనస్వాగతం పలికారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు ఆమె ఇక్కడకు వచ్చారు.

[YSR Congress Party] కిక్కిరిసిన అనంత వీధులు

షర్మిల పాదయాత్ర ఆకుతోటపల్లి, సెరీకల్చరల్‌ ఆఫీసు, ఐరన్‌ ఆఫీసు , సప్తగిరి సర్కిల్‌ సుభాష్‌ రోడ్డు, క్లాక్‌ టవర్‌ సెంటర్‌, కళ్యాణ్‌ దుర్గం సర్కిల్‌ మీదగా సాగుతోంది... పాదయాత్రకు జనం పోటెత్తారు... జనతరంగాలుగా అనంతపురం వీధులన్ని కిక్కిరిసిపోయాయి.రాత్రికి అనంతపురం శివార్లలో షర్మిల బసచేస్తారు.  

[YSR Congress Party] వైఎస్ఆర్ సిపి లో చేరిన శరత్‌చంద్రారెడ్డి

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల, ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డిల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పరిమళ రంగారెడ్డి కుమారుడు శరత్‌చంద్రారెడ్డి పార్టీలో చేరారు. సప్తగిరి సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభలో ఆయన షర్మిలను కలిశారు. ఆయనతోపాటు 19 మంది మాజీ సర్పంచ్‌లు, 14 మంది ఎంపీటీసీలు, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, ఇద్దరు మాజీ మండలాధ్యక్షులు, ముగ్గురు నీటి పారుదల సంఘం అధ్యక్షులు పార్టీలో చేరారు.

[YSR Congress Party] చెంపదెబ్బ- గోడదెబ్బ!

గోదావరి జిల్లాల ప్రజలకు చమత్‌‘కారం’ అంటే మహయిష్టం! తెలుగు సినిమాల పుణ్యమాని -బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సునీల్ లాంటి నటుల మాటల ద్వారా- ఈ విషయం రాష్ట్రమంతా పాకిపోయింది. నిజానికి అంతకు ఎన్నో తరాల ముందునుంచీ ‘గోదారి నీళ్లకు పదునెక్కువ’ అనే అభిప్రాయం పాతుకుపోయింది. ఇది ఏదో కాలక్షేపం కబుర్లకే పరిమితమయిన విషయం కాదు. రాజకీయ తీర్పులు ప్రకటించే సందర్భంలో కూడా గోదావరి జిల్లా ప్రజలు గొప్ప చమత్‌‘కారం’ ప్రదర్శిస్తూ ఉంటారు. సార్వత్రిక ఎన్నికలప్పుడు గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో పరిశీలకులు ఓ కంట కనిపెడుతుంటారు. ఎందుకంటే, ఆ జిల్లాల్లో ఏ పార్టీకి ఆధిక్యం దక్కితే, అదే పార్టీ -సాధారణంగా- ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పరిశీలకులు నమ్ముతారు. ఈ అంచనా, ఒక్క ఎన్నికల ఫలితాలకే పరిమితం కాదు. ప్రజాదరణకూ, ప్రజాభిప్రాయ ప్రకటనకూ సైతం వర్తించడం సహజం!

ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఎన్నికలేం జరగడం లేదు. అయితే, ప్రతినిత్యం ప్రజాభిప్రాయం ఏదో రూపంలో వ్యక్తమవుతూనే ఉంది. ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్- టీడీపీ ‘కూటమి’కి చెందిన ఎమ్మెల్యేలూ, మాజీలూ క్యూ కట్టి వైఎస్‌ఆర్‌సీపీలో వచ్చి చేరుతున్నారు. తాజాగా సోమవారం నాడు -అక్టోబర్ 29న- చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చిత్రమేమిటంటే, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజేష్ పై పోటీచేసిన కర్రా రాజారావు కూడా వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. చింతలపూడికి దగ్గిర్లోనే ఉండే గోపాలపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెల్చిన తానేటి వనిత కూడా టీడీపీ నుంచి రాజీనామా చేశారు. ఆమె కూడా త్వరలోనే వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారని చెప్తున్నారు. కొవ్వూరు ప్రాంతానికి చెందిన బలమయిన టీడీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతోనే ఇక్కడి రాజకీయ సమీకరణల్లో మార్పు మొదలయింది. అది క్రమంగా ఊపందుకుని పెనుమార్పులకు దారి తీస్తోంది. 

ఇక, పాయకరావు పేట నియోజకవర్గం నుంచి తెలుగు దేశం ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన ప్రముఖ సినీ నిర్మాత చెంగల వెంకట రావు కూడా వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇదిలాఉండగా,అనంతపురం జిల్లాకు చెందిన నేత, ప్రస్తుతం తెలుగు రైతు రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్న తరిమెళ్ల శరత్ చంద్రారెడ్డి కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర చేపట్టి.. జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల సమక్షంలో తన అనుచరులతో కలిసి శరత్ చంద్రారెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరనున్నారు. దీంతో, దాదాపు రెండేళ్లుగా మన రాష్ట్రంలో సాగుతున్న టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయానికి చావుదెబ్బ తగిలినట్లయింది. 

ఒకవైపు పదవికోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఈ రాజీనామాలూ, రాజకీయ సమీకరణల్లో మార్పులూ జరగడం ప్రత్యేకించి పేర్కోవలసిన విశేషం. పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణబాబు వర్గం టీడీపీకి వెన్నెముక లాంటిది. చంద్రబాబు నాయుడు ఈ వర్గం ముఖ్యలతో ‘హాట్‌లైన్’ మెయింటెయ్న్ చేస్తారని చెప్పుకుంటారు. టీడీపీకి ఆ జిల్లాలో ఒక సామాజిక వర్గం నుంచి గట్టిమద్దతు లభించడానికి సైతం కృష్ణబాబు వర్గం వత్తాసే కారణం. టీడీపీకి రాజీనామా చేసిన తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీ రావు -గతంలో టీడీపీ తరఫున గెలిచిన-మాజీ ఎమ్మెల్యే. కృష్ణబాబు వర్గానికి చెందిన దళిత ప్రముఖుడు. ఆయన కుమార్తెగానే కాక, అసెంబ్లీలో జిల్లా సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేగా కూడా తానేటి వనిత కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఇక, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ పిన్న వయసులోనే అసెంబ్లీకి ఎన్నికయిన యువనేత. సౌమ్యుడూ, సాత్వికుడూ కావడంతో ఆయనకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆదరణ ఉంది. ఆయనకు పోటీగా టీడీపీ తరఫున రంగంలోకి దిగి, ఓడిపోయిన కర్రా రాజారావు కూడా జనబలం ఉన్న నేత. ఈ నాయకులందరూ ఒకేసారి టీడీపీ-కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభావం నుంచి బయటపడ్డం చూస్తే ఇక ఆ జిల్లాలో టీడీపీ బతికి బట్టకట్టే సమస్యే లేదనిపిస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శల్యావశిష్టమయి ఉంది. ఏనాడో ఆ పార్టీకి చెందిన ప్రజాబలం కలిగిన నేతలంతా వైఎస్‌ఆర్‌సీపీలో చేరిపోయారు. ఇంకా కాంగ్రెస్ శథిలాలయాన్ని అంటిపెట్టుకుని వేల్లాడుతున్న దివాంధాలకు ఈ దెబ్బతో కొసప్రాణం సైతం కడబట్టినట్లయింది.

గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్- టీడీపీ అపవిత్ర కూటమికి భవిష్యత్తు లేదని ఎన్నడో తేలిపోయింది. అంతకుమించి -ఈ పరిణామాల పర్యవసానంగా- అటు కాంగ్రెస్ పార్టీకీ ఇటు టీడీపీకీ కూడా చెంపదెబ్బా గోడదెబ్బా తగిలాయి. నాయకులే కాదు, ప్రజా పునాది కూడా ఈ దెబ్బతో కదిలిపోయింది. ఇప్పట్లో ఈ పార్టీలు కోలుకోవడం అసాధ్యం.



[YSR Congress Party] చంద్రబాబు కూడా టిడిపిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం మంచిది

విశాఖ జిల్లా పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో అదికారికంగా చేరారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం అదినేత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు కూడా టిడిపిని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం మంచిదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలను జనం నమ్మడం లేదని, అందుకే తాను ఆ పార్టీని వీడి బయటకు వచ్చానని అన్నారు. వై.ఎస్.జగన్ ను కాంగ్రెస్,టిడిపిలు కలిసి ఎంత అణచాలని చూస్తే అంతకన్నా ఎక్కువగా ఆయన పైకి వస్తారని, జనం అంతా జగన్ ను సి.ఎమ్. ను చేయాలని భావిస్తున్నారని చెంగల చెప్పారు. పది సంవత్సరాలపాటు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసిన వెంకటరావు ఇప్పుడు ఏకంగా టిడిపిని కాంగ్రెస్ లో కలపమనడం ఆశ్చర్యంగానే ఉంటుంది.తాను ప్రస్తుత ఎమ్మెల్యే బాబూరావుతో కలిసి పనిచేస్తానని, ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

[YSR Congress Party] మరో ప్రజా ప్రభంజనం: మేకపాటి


 వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నేతలు తోపుదుర్తి కవిత, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ, ఎల్ ఎమ్ మోహన్ రెడ్డి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర... మరో ప్రజా ప్రభంజనం అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు వేలాదిమంది స్వచ్చందంగా తరలి వస్తున్నారన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి పదవులు ఎక్కువగా ఇవ్వటానికి జగన్ ప్రభంజనమే కారణమన్నారు. జైపాల్ రెడ్డికి శాఖ మార్చటం అప్రజాస్వామికమని మేకపాటి వ్యాఖ్యానించారు.

[YSR Congress Party] జగన్ నాయకత్వంలో పనిచేస్తా: రాజేష్


తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరవలసి వచ్చిందో చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్ కుమార్ సోమవారం మూడు పేజీల లేఖను విడుదల చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తన నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోయిందని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యాలను సాధింగలనన్న విశ్వాసాన్ని రాజేష్ కుమార్ వ్యక్తం చేశారు. 

తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి ఇన్నాళ్లు దూరంగా ఉండటం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వైఎస్ స్ఫూర్తితో కేవలం మూడు నెలల కాలంలో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో అనుకున్న కార్యక్రమాలు అమలు చేయకపోవడం నియోజకవర్గ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిందని రాజేష్ తెలిపారు. భవిష్యత్ లో వైఎస్ ఆశయాల కోసం జగన్ తో కలిసి నడుస్తానని ఆయన స్పష్టం చేశారు.


--

[YSR Congress Party] వైఎస్ఆర్ సీపీలో చెంగల చేరిక

విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చెంగల వెంకట్రావుకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.కాగా మరోవైపు చింతలపూడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ ఈరోజు ఉదయం విజయమ్మతో భేటీ అయ్యారు.

[YSR Congress Party] వైఎస్ఆర్ సీపీలోకి చింతలపూడి ఎమ్మెల్యే

హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలకు గట్టి షాక్ తగిలింది. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. రాజేష్ కుమార్ సోమవారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం నుంచి రాజేష్ కుమార్ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 


మరోవైపు గత ఎన్నికల్లో రాజేష్ కుమార్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైన టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావు కూడా వచ్చే నెల 4న కొవ్వూరు బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అలాగే పాయకరావుపేట మాజీ టీడీపీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Sunday, 28 October 2012

[YSR Congress Party] మరో ప్రజా ప్రస్థానంలో చంద్రబాబుపై షర్మిల ధ్వజం


అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందని బాబుకు భయం
ఎమ్మెల్యేలు ఉన్నా ఎందుకు ఈ ప్రభుత్వాన్ని దించేయడం లేదు
బాబు తన హయాంలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు
ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అడిగితే ఎగతాళి చేశారు
అప్పుడు గ్రామాలను శ్మశానాలుగా మార్చి.. ఇప్పుడు వాటి గుండా పాదయాత్ర చేస్తున్నారు
బాబు అనుకున్నంత అమాయకులు కాదు ప్రజలు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 11, కిలోమీటర్లు: 151.4

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. అటు కరెంటు చార్జీల మోత.. ఇటు ఆర్టీసీ చార్జీల వాత.. ఇవి చాలవన్నట్టు 4 శాతం పెరిగిన అమ్మకపు పన్ను.. పేదవాడు కడుపు నిండా ఒక్క పూట భోజనం చేయలేని పరిస్థితి. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి అన్నింటా ఘోరంగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నేతగా నిలదీయాల్సింది పోయి.. దానితోనే కుమ్మక్కయ్యారు. అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయకుండా డ్రామాలాడుతున్నారు. అవిశ్వాసం కాదు.. అవసరమైతే విశ్వాస తీర్మానం పెట్టేలా ఉన్నారు..!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

‘‘మీకు ఎమ్మెల్యేలు ఉన్నారుగా.. ప్రభుత్వాన్ని ఎందుకు దించేయరు?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆదివారం 11వ రోజు పాదయాత్రలో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని కందుకూరు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) ప్రాంగణంలో అమె జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పాదయాత్ర ఆసాంతం జన సైన్యం ఉప్పొంగింది. యువకులు, మహిళలు భారీ సంఖ్యలో షర్మిలతో పదం కలిపారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కందుకూరు కిక్కిరిసిపోయింది. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఆవరణలో జరిగిన భారీ బహిరంగ సభకు యువకులు పోటెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తున్న చంద్రబాబు వైఖరిని, కుమ్మక్కు రాజకీయాలను షర్మిల కడిగిపారేశారు.

‘‘కరువొచ్చి రైతన్న దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంటే చంద్రబాబు హయాంలో 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రైతన్నలను వేధించారు. సామాను లాక్కున్నారు. కేసులు పెట్టారు. అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. బకాయిలు కట్టలేక, అవమాన భారం మోయలేక ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పరిహారమివ్వాలని అడిగితే ఎగతాళి చేశారు. అదే చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం కొత్తగా పాదయాత్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి.. ఇప్పుడు అవే గ్రామాల గుండా నడుస్తున్నారు. ప్రజల కాళ్లూ చేతులూ పట్టుకుని క్షమాపణ అడిగినా ఆయన చేసిన పాపం పోదు’’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు గారూ.. ఏ ముఖం పెట్టుకుని ఆ గ్రామాలకు వెళుతున్నారు. మాబోటి వారు పాదయాత్ర చేసినా అర్థం ఉంది. మీకు ఎమ్మెల్యేలు ఉన్నారుగా. ఎందుకు దించేయరు? దించేయకుండా.. నాకు మళ్లీ అవకాశం ఇవ్వండి .. కుర్చీ ఇవ్వండి అని ప్రజలను బతిమాలుకుంటున్నారు. చంద్రబాబుకు ఒక అలవాటు ఉంది. ఆయన మాట మీద నిలబడడు. ప్రజలు అమాయకులు కాదు. బాబు అనుకుంటున్నట్టు ప్రజలు పిచ్చోళ్లు కాదు.. రెండు రూపాయలకు కిలోబియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్టీఆర్ అధికారంలోకి వస్తే.. 9 నెలల్లోనే మామకు వెన్నుపోటు పొడిచి సీటు లాగేసుకుని, ఆ రెండు హామీలను తుంగలో తొక్కారు..’’ అని విమర్శించారు.

జగనన్న అన్ని సీట్లూ గెల్చుకుంటాడనే..: కాంగ్రెస్, చంద్రబాబులు నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు దిగి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేశారని షర్మిల మండిపడ్డారు. ‘‘వీరిద్దరూ కలిసి అబద్ధపు కేసులు పెట్టారు. సీబీఐని వాడుకుని జగనన్నను జైల్లో పెట్టారు. వారి లక్ష్యం ఒక్కటే.. జగన్! జగన్ మీ మధ్య ఉంటున్నాడని, మీ మనిషిగా ఉన్నాడని, మీ గుండెల్లో ఉన్నాడని వారికి అక్కసు. దీన్ని చూసి కాంగ్రెస్, టీడీపీలు తట్టుకోలేకపోయాయి. ఆ పార్టీలకు మనుగడ ఉండదని, 2014లో జగన్ అన్ని సీట్లూ గెలుచుకుంటాడని, ఇక వారి దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని వారి భయం.

అందుకే కుట్రలు పన్ని బెయిల్ రాకుండా పెద్దపెద్ద వాళ్లతో మాట్లాడి జనం మధ్య లేకుండా చేశారు. అన్యాయం ఎన్నో రోజులు నిలవదు. అధర్మానికి శక్తి లేదు. దేవుడున్నాడు. దేవుడున్నాడన్నది ఎంత నిజమో.. మంచివాళ్ల పక్షాన నిలబడతాడన్నదీ అంతే నిజం. జగన్ వస్తాడు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడు’’ అని అన్నారు. ‘‘కోటి ఎకరాలకు నీరివ్వాలన్నది రాజన్న స్వప్నం. రాష్ట్రంలో గుడిసె అన్నదే లేకుండా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నది రాజన్న కల. చదువుకు పేదరికం ఆటంకం కారాదని, కుటుంబంలో ఒక్కరన్నా డాక్టరో, ఇంజనీరో అయితే ఆ కుటుంబం బాగుపడుతుందన్నది రాజన్న ఆశయం. వీటన్నింటినీ జగనన్న నెరవేరుస్తాడు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద పదో తరగతి వరకు రూ.500, ఇంటర్ అయితే రూ.700, డిగ్రీ అయితే రూ.1,000 తల్లి బ్యాంకు ఖాతాలో వేస్తాడు. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది..’’ అని పేర్కొన్నారు.

సాక్షులను కాదు.. మిమ్మల్ని ప్రభావితం చేస్తాడనే..: విజయమ్మ

ఎస్కేయూ ముందు జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘ప్రజల కష్టసుఖాలను 25 ఏళ్లపాటు పంచుకున్న వైఎస్ మరణానంతరం జగన్‌బాబు మీ మధ్య ఉంటూ విద్యార్థులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికుల కోసం పోరాటాలు చేస్తుంటే సీబీఐ, కాంగ్రెస్, టీడీపీలు కలిసి కుమ్మక్కై కేసులు పెట్టాయి. అయినా వాటిని పట్టించుకోకుండా 10 నెలలు జగన్ మీమధ్యనే ఉన్నాడు. ఉప ఎన్నికలు రాగానే విచారణ పేరుతో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే జైలులో పెట్టారట. వారి భయం అది కాదు. మిమ్మల్ని (ప్రజలను) ప్రభావితం చేస్తాడనే వారి భయం. జగన్‌ను బందీ చేసి నిన్నటికి ఐదు నెలలైంది. జగన్ బయటకు వస్తాడనుకున్న ప్రతిసారి కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్ని బెయిల్ రాకుండా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే మీకు ధైర్యం ఇవ్వాలని జగన్ షర్మిలను పంపాడు..’’ అని చెప్పారు. చంద్రబాబు ఈ ప్రభుత్వానికి సలహాదారుగా మారిపోయారని విమర్శించారు.


చికిత్సకు భరోసా

కందుకూరుకు చెందిన మంజునాథ్‌రెడ్డి అనే బీటెక్ విద్యార్థి బోన్‌మారో అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ నిరుపేద కుటుంబం ఇప్పటికే వైద్యానికి రూ.2 లక్షలు వెచ్చించింది. వైద్యులు రూ.15 లక్షల ఖర్చవుతుందని, వేలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. పాదయాత్రలో మంజునాథ్‌రెడ్డి పరిస్థితిని తెలుసుకున్న షర్మిల... అతడిని పరామర్శించి చికిత్సకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. సోమవారం ఉదయాన్నే వచ్చి ఎమ్మెల్యే గురునాథరెడ్డిని కలవాలని షర్మిల సూచించినట్టు మంజునాథరెడ్డి తల్లి చెప్పారు.

మాకు దిక్కెవరు?
షర్మిల ముందు గోడు వెళ్లబోసుకున్న రైతు కూలీలు


‘‘తాగునీళ్లు లేవు. సాగునీళ్లు లేవు. పంటలు లేవు. కరెంటు అసలే ఉండడం లేదు. కరువు పనులు కూడా దొరకడం లేదు. దొరికినా కూలి రూ.50 నుంచి రూ. 60లకు మించి పడడం లేదు. ఒక్కోసారి రూ. 30లే వస్తోంది. అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు. మాకు దిక్కెవ్వరు. ఇక మీరే చూడాలి మమ్మల్ని.. ఇదివరకు వచ్చిన పెన్షన్‌ను కూడా ఇప్పుడు తీసేశారు..’’ అంటూ రైతు కూలీలు షర్మిల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శనివారం రాత్రి జ్వరం నుంచి కోలుకున్న షర్మిల ఆదివారం ఉదయం 10 గంటలకు చిగిచర్ల నుంచి పాదయాత్రకు బయల్దేరారు.

మార్గమధ్యలో వ్యవసాయ కార్మికులతో మాట్లాడారు. ఉప్పులేశునిపల్లి, పాల్వాయి తదితర గ్రామాలకు చెందిన రైతు కూలీలు షర్మిలతో తమ బాధలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారిలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఆమె చలించిపోయారు. వారి చేతులు పట్టుకుని ‘‘ఇంత వయస్సులో కూడా మీరు కష్టపడాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. వణుకుతున్న చేతులతో మీరు పనికి వెళుతున్నారంటే బాధగా ఉంది..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అంపాపురం క్రాస్‌రోడ్డులో ఉన్న కెనాల్ వద్ద షర్మిల ఆగి... ఎండిపోయిన ఆ కెనాల్ పరిస్థితి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12.30కు అంపాపురం సమీపంలో భోజన విరామానికి ఆగారు. తిరిగి 3.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. 4.30కు కందుకూరులో, సాయంత్రం 6.30కు శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఆవరణలో జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ్నుంచి రాత్రి 7.35 గంటలకు సమీపంలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. ఆదివారం పాదయాత్రలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

[YSR Congress Party] హెరిటేజ్ మిఠాయికి మళ్లీ బూజు


దరాబాద్, న్యూస్‌లైన్: హెరిటేజ్ పార్లర్‌లో కొనుగోలు చేసిన మిఠాయి బూజు పట్టిఉండడంతో వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. హైదరాబాద్‌లోని రాజరాజేశ్వరీనగర్‌కు చెందిన కిషన్‌సింగ్ ఆదివారం సాయంత్రం బల్కంపేట్‌లోని హెరిటేజ్ పార్లర్‌లో 200 గ్రాముల దూద్‌పేడను కొనుగోలు చేశారు. ప్యాకెట్‌పై తయారీ తేదీ ఈ నెల 22 అని, పది రోజుల్లోగా వాడాలని ముద్రించి ఉంది. ఇంటికి వెళ్లి ప్యాకెట్‌ను తెరిచి చూడగా లోపల మిఠాయి బూజు పట్టి ఉంది. దీంతో ఆయన ఆగ్రహంతో దూద్‌పేడను తిరిగి పార్లర్‌కు తీసుకువచ్చి నిర్వాహకుడు ప్రకాశ్‌ను నిలదీశారు. అవి కంపెనీ నుంచి నేరుగా తమకు వస్తాయని ఆయన సర్దిచెప్పి, హెరిటేజ్ సంస్థ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ప్రకాశ్ వాపోయాడు.

[YSR Congress Party] నేడు షర్మిల పాదయాత్ర సాగేదిలా..


అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా సోమవారం ఎస్కేయూ వద్ద నుంచి ఆకుతోటపల్లి, అనంతపురం నగర పరిధిలోని లేపాక్షినగర్, పంగల్‌రోడ్డు, ఆర్డీటీ ఆసుపత్రి, ప్రజావైద్యశాల, విజయనగరకాలనీ, కలెక్టరేట్, పవర్ ఆఫీసు, విజయక్లాత్ స్టోర్ సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, సప్తగిరి సర్కిల్, వైఎస్సార్ సర్కిల్, సుభాష్‌రోడ్డు, క్లాక్‌టవర్, ఓవర్‌బ్రిడ్జి, నడిమివంక, కళ్యాణదుర్గం బైపాస్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ ప్రోగామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు. సోమవారం 11.2 కిలోమీటర్ల మేర షర్మిల నడుస్తారని చెప్పారు. నగరంలోన సప్తగిరి సర్కిల్ బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారన్నారు. 

[YSR Congress Party] జనం ఉప్పెనలా


జనం.. జనం.. కనుచూపు మేరలో.. కిలోమీటర్ల మేర ఒకటే జనం. ఇసుక వేస్తే 
రాలనంతగా.. రహదారి సరిపోనంతగా. వైఎస్ తనయ, జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 
చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఆదివారం రాప్తాడు నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వృద్ధులు మొదలు చిన్నారుల వరకు స్వచ్ఛందంగా తరలి వచ్చి పాదయాత్రకు మద్దతు తెలిపారు. కందుకూరు దాటిన తర్వాత జనం ఉప్పెనలా ఎగిసి పడటంతో 
నడవడానికి రహదారి సరిపోలేదు. దీంతో సగం మంది రైల్వే ట్రాక్ వెంట, పొలాల వెంబడి నడిచి వచ్చారు. జగన్నినాదాలతో ‘అనంత’ శివారు హోరెత్తిపోయింది.

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచి 
న్యూస్‌లైన్‌ప్రతినిధి:‘ మరో ప్రజాప్రస్థానం పిలిచింది..పదండి ముందుకు.. పదండి తోసుకు
చెట్లు, పొదలు, పుట్టలు, పొలాలు, అడవులా మనకడ్డంకి?షర్మిలతో పదం కదుపుతూ.. కదం తొక్కుతూ పదండి ముందుకు పదండి తోసుకు’... ఇదీ రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఆదివారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి అయిన షర్మిల పాదయాత్రకు వచ్చిన జనస్పందన. శనివారం రాత్రి ధర్మవరం మండలం చిగిచెర్ల శివారులో బస చేసిన షర్మిల ఆదివారం ఉదయం 10.15 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. ధర్మవరం-అనంతపురం వయా చిగిచెర్ల రహదారి మీదుగా పాదయాత్ర సాగింది.

సింగిల్ రోడ్డుపై నడక మొదలుపెట్టారు. బస చేసిన ప్రాంతం నుంచి అర కిలోమీటరు నడవగానే చీమలపుట్ట పగిలినట్లు ఒక్కసారిగా జనవిస్ఫోటనం సంభవించింది. జనం రోడ్డు వెంబడి భారీ సంఖ్యలో బారులు తీరారు. సింగిల్ రోడ్డు పట్టక.. రోడ్డుకు ఇరువైపులా పొలాల వెంబడి, చెట్ల వెంబడి.. పుట్ల వెంబడి, వాగులు, వంకలు దాటుకుంటూ షర్మిలను అనుసరిస్తూ కదంతొక్కారు. షర్మిల ముందూ.. వెనకా కనుచూపు మేరలో రహదారిపై జనం కన్పించారు. తరచుగా చేతులు ఊపుతూ.. చిరుమందహాసం చేస్తూ.. వడివడిగా అడుగులు వేస్తూ కదంతొక్కుతోన్న జనాన్ని షర్మిల ఉత్సాహపరిచారు. 


[YSR Congress Party] రేపు భువనగిరి సభకు వైఎస్ విజయమ్మ!

భువనగిరి: నల్గొండ జిల్లా భువనగరిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలో విజయమ్మ సమక్షంలో యువతెలంగాణ పార్టీ కన్వీనర్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు భువనగిరిలో బహిరంగసభ జరుగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

[YSR Congress Party] ఏలూరు ప్రజలను సీఎం మోసం చేశారు: నాని


శనివారపుపేట: ఏలూరు ప్రజలను సీఎం కిరణ్ మోసం చేశారని ఎమ్మెల్యే ఆళ్ల నాని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని శనివారపుపేటలో ఎమ్మెల్యే ఆళ్ల నాని చేపట్టిన పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ..పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రచ్చబండలో సీఎం హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకూ ఆ హామీని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. వైఎస్ఆర్‌ హయాంలో 10 వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చారని.. ఆయన మరణం తర్వాత పథకాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయితేనే పేదల కష్టాలు తొలిగిపోతాయని ఎమ్మెల్యే ఆళ్లనాని అన్నారు.

[YSR Congress Party] చంద్రబాబుపై షర్మిల మండిపాటు

కందుకూరు: మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల టిడిపి అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కిరణ్ ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టడం ఏమోగానీ ..విశ్వాస తీర్మానం పెడతాడేమోనని ఎద్దేవా చేశారు. ప్రజలను కాల్చి చంపిన పోలీసులను పరామర్శించడానికి వెళ్లిన ఘనుడు బాబు అని విమర్శించారు .కందుకూరులో మాట్లాడిన షర్మిల ప్రభుత్వం చేతగానితనంపై మండిపడ్డారు. 

వైఎస్ఆర్‌ ప్రజల గురించి ఎలా ఆలోచించేవారో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగాను రైతులను ఆదుకోవడంలేదని విమర్శించారు. ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందడంలేదన్నారు. ఆరోగ్య శ్రీని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు జబ్బు చేస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తారా అని ప్రశ్నించారు.

[YSR Congress Party] తెలుగుదేశం పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యం

దళిత మహిళనని అవమానిస్తున్నారు
చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదు
గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత వెల్లడి
భవిష్యత్ కార్యాచరణపై రెండురోజుల్లో నిర్ణయం

దేవరపల్లి(పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: టీడీపీలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని, మూడున్నరేళ్లుగా పార్టీలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొన్నానని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొంతమంది అగ్రకుల నాయకులు తనను ఇబ్బంది పెడుతున్నట్లు ఆమె వాపోయారు. దళిత మహిళను కావడంవల్లే వారు తనను చిన్నచూపు చూస్తున్నారన్నారు. తానెదుర్కొంటున్న అవమానాల గురించి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు మూడేళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందన్నారు. ఎమ్మెల్యే వనిత దేవరపల్లి మండలం యర్నగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నా పార్టీ పట్టించుకోవట్లేదన్నారు. పార్టీ అధిష్టానమూ బాపిరాజుకే కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా, అధిష్టానం నుంచి గుర్తింపు ఉండట్లేదన్నారు. చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావంగా ఇటీవల నియోజకవర్గంలో సుమారు వంద కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించానని, అప్పుడూ కొందరు నాయకులు తనను ఇబ్బందులకు గురి చేశారని ఆమె వివరించారు. 

అల్లూరి విక్రమాదిత్య పార్టీలో చే రుతున్న విషయంగానీ, ఈ నెల 24న నిర్వహించిన కార్యక్రమం గురించికానీ తనకెవ్వరూ సమాచారం ఇవ్వకపోవడం తీవ్రమనస్తాపానికి గురి చేసిందన్నారు. తన నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో విక్రమాదిత్య కార్యక్రమాలు జరిగినప్పటికీ తనకు ఆహ్వానం లేదన్నారు. విక్రమాదిత్య కార్యక్రమం జరిగినప్పటి నుంచి తనకు ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేకపోతున్నానన్నారు. 

ఇక భరించే శక్తిలేదు: మూడేళ్లుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇంటి ఇబ్బందులను వీధిలో పెట్టకూడదనే ఆలోచనతో.. ఓర్పుతో ఇంతకాలం భరించానన్నారు. ఇక భరించే ఓపికలేక తన అసంతృప్తిని పత్రికలు, మీడియా ద్వారా అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు వనిత తెలిపారు. పార్టీలో స్వేచ్ఛ లేనప్పుడు ఎలా పనిచేయగలనని ప్రశ్నించారు. పొమ్మనలేక పొగపెట్టినట్టుగా పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పార్టీ మారుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రెండురోజుల్లో కార్యకర్తలు, నాయకుల సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె చెప్పారు.

[YSR Congress Party] తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే ఆ రెండు పార్టీలు కుట్ర


మరో ప్రజాప్రస్థానంలో వైఎస్ షర్మిల మండిపాటు
తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి
చంద్రబాబుకు బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది
జగనన్న సీఎం అయితే రైతులు తలెత్తుకొని జీవిస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 10, కిలోమీటర్లు: 139.4

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాజన్న కొడుకుగా జగనన్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై పోరాడుతున్నాడు. జగనన్న మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడన్న భయంతో, ఇక తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందన్న కారణంతో కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని దొంగ కేసులు పెట్టాయి. ఈ అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. బాబుగారికి బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మండిపడ్డారు. జగనన్న సీఎం అయితే రైతులు తలెత్తుకొని తిరుగుతారని, వారి కష్టాలు తీరిపోతాయని చెప్పారు. 

శనివారం పదోరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తన ముందు గోడు వెళ్లబోసుకున్న అనంతపురం జిల్లా రైతులకు షర్మిల ఈ మేరకు భరోసానిచ్చారు. జ్వరం కారణంగా షర్మిల కాస్త అస్వస్థతకు గురయ్యారు. అయినా ఉదయం 10.30కు పాదయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యలో బడన్నపల్లి క్రాస్ సమీపంలో చెన్నారెడ్డి అనే రైతు వేరుశనగ పంటను పరిశీలించారు. తాను పూర్తిగా నష్టపోయానని ఆ రైతు మొరపెట్టుకున్నారు. భార్య తాళిబొట్టును కూడా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చానని, ఐదెకరాల్లో 60 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేస్తే ఇప్పుడు పంటకు రూ. 15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంతకుముందు మండలం యూనిట్‌గా పంట బీమా అందేదని, ఇప్పుడు దాన్ని తీసేసి వాతావరణ ఆధారిత బీమా అని ఇస్తున్నాని చెప్పారు. దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘రాజన్న ఉన్నప్పుడు పరిహారం చెల్లించే ఉద్దేశం ఉంది కాబట్టే గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. 

ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పరిహారం ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఇలా అనేక ఆంక్షలు పెడుతున్నారు.. మన్ను తిని బతకాలని చెబుతోంది ఈ ప్రభుత్వం. జగనన్న సీఎం అయితే రైతు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుంది..’’ అని చెప్పారు. బడన్నపల్లి క్రాస్‌రోడ్డులో 11.15కు జిల్లాకు చెందిన పలువురు ముస్లిం సోదరులు షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు రాగా వారికి షర్మిల బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బడన్నపల్లి స్థానికులంతా తమకు గ్రామాల్లో నీళ్లు లేవని, కరెంటు ఉండడం లేదని వాపోయారు. అర్ధరాత్రి కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు పంట వద్దే పడుకోవాల్సి వస్తోందని, ప్రాణాలకు కూడా భద్రత లేదని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు ఉండేదని, వర్షాలు బాగా పడేవని గుర్తుచేసుకున్నారు. అందుకు ‘‘రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. రాజన్న ఉన్నప్పుడు మాట మీద నిలబడ్డాడు. అందుకే అప్పుడు సుభిక్షంగా ఉంది..’’ అని షర్మిల వారితో పేర్కొన్నారు. రైతుల అవసరాలు గుర్తించి ముందు చూపుతో రాజన్న కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేశారని, ఈ ప్రభుత్వానికి ముందు చూపులేదని విమర్శించారు.

వాళ్లు 3 కి.మీ. నుంచి నీళ్లు తె చ్చుకుంటే తెలుస్తుంది..

స్థానికులు నీటి సమస్యను షర్మిలతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకురావడంతో ఆప్పుడు నీటి సమస్య లేదు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ నీళ్లు రాక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రభుత్వం నిద్రపోతోంది. ముఖ్యమంత్రికేం బాగానే ఉన్నారు. మూడు కిలోమీటర్లు పోయి ఆయన భార్య నీళ్లు మోసుకొస్తే ఆ బాధ అర్థమయ్యేది. ఈ పాపం ఈ సర్కారుదే..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.15కు గరుడాపల్లి సమీపంలో భోజన విరామానికి ఆగారు. జ్వరం కారణంగా విశ్రాంతి తీసుకుని తిరిగి సాయంత్రం 5 గంటలకు బయలుదేరారు. దారిలో వసంతపురం గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు చిగిచెర్లకు చేరుకోగా స్థానికులు షర్మిలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం తుంగభద్ర నీటిని తీసుకురావడంలో విఫలమవడం వల్లే ఇక్కడ నీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. అనంతరం రాత్రి 7.40కి చిగిచర్ల సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రిబస స్థలానికి చేరుకున్నారు.

షర్మిలకు జ్వరం

షర్మిలకు శుక్రవారం రాత్రి నుంచే జ్వరం రావడంతో కొద్దిగా నీరసించారు. రాత్రి 101.8 డిగ్రీల జ్వరం ఉందని, రెండు రోజులుగా తీవ్ర జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారని షర్మిల చిన్నాన్న కుమారుడు, వైఎస్సార్ పార్టీ నేత వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రానికి జ్వరం కాస్త తగ్గిందన్నారు. ఉదయం అనంతపురం నుంచి రిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేశ్వరరావు షర్మిలకు వైద్య పరీక్షలు చేశారు. సాయంత్రం పులివెందుల నుంచి వైద్య నిపుణులు, వైఎస్ జగన్ మామ, అత్తగార్లు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణమ్మ వచ్చి షర్మిలను పరీక్షించారు. షెడ్యూలు ప్రకారం షర్మిల శనివారం 13.8 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా.. 8.5 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగారు. పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, మరో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఆయన సతీమణి మాధవి, వాసిరెడ్డి పద్మ తదితరులు నడిచారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాయంత్రం కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

షర్మిల పాదయాత్రలో ఎన్‌ఆర్‌ఐలు

ధర్మవరం, న్యూస్‌లైన్: మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన షర్మిళకు స్థానిక ప్రజలే కాక విదేశాల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు యాత్రలో పాల్గొంటున్నారు. అమెరికా నుంచి పవన్‌కుమార్, అమర్‌జీవ్, అవినాష్, వేణుగోపాల్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విభాగం మెంబర్ షిప్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎన్‌ఆర్‌ఐ సంఘం రాష్ట్ర కన్వీనర్ వెంకట్ మేడపాటి ఆధ్వర్యంలో యాత్రలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. కువైట్, డల్లాస్ నుంచి మరికొందరు ఈ పాదయాత్రలో పాల్గొంటారన్నారు.

[YSR Congress Party] మీ పలుకుబడితో చేస్తున్న పని ఇదా?!


ప్రజలు మిమ్మల్ని నాయకులుగా చేసింది మీ స్వప్రయోజనాల కోసం పోరాడడానికా, ప్రజల స్వరం వినిపించడానికా? జగన్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఒక్క శాతం అయినా ప్రజలకోసం నిజంగా పోరాడండి. ప్రజలకు సౌకర్యాలను సాధించిపెట్టండి. అప్పుడు ‘మీకోసం’ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.

కొద్దిరోజుల క్రితం జగన్ బెయిల్ హియరింగ్ రోజున- అంటే అక్టోబర్ 5న సుప్రింకోర్టుకు సీబీఐ అందించిన స్టేటస్ రిపోర్ట్ చూశాను. అందులో ‘సాక్షి’ సంస్థ ఆస్తుల ఈడీ అటాచ్‌మెంట్ ప్రస్తావన వుంది. అది చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది - కాంగ్రెస్, సంబంధిత సీబీఐ మరియు టీడీపీ ఎంత బాగా కలిసి పనిచేస్తున్నాయో.

సుప్రింకోర్టులో రాతపత్రం - అందునా 17 పేజీల రాతపత్రం సమర్పించాలంటే అప్పటికప్పుడు టైప్ చేయించి ఇవ్వడం వీలుపడదు. కానీ అక్టోబర్ 4 సాయంత్రం చంద్రబాబుగారి టీడీపీ ఎంపీలు చిదంబరం గారిని కలిసి ‘జగన్ ఆస్తులను అటాచ్ చెయ్యండి’ అని వినతిపత్రం ఇచ్చారు. ‘మీకోసం’ పాదయాత్రలో ఉన్న బాబుగారితో ఫోన్‌లో మాట్లాడించారు. రెండుమూడు గంటల వ్యవధిలో ‘సాక్షి’ సంస్థ ఆస్తులు అటాచ్ అయ్యాయి. ఇది అక్టోబర్ 5న సీబీఐ రాతపత్రం సమర్పించడానికి కొన్ని గంటల ముందు జరిగిన పరిణామం. అయినప్పటికీ సీబీఐ రాత

పత్రంలో ఈ విషయం చోటుచేసుకుంది. రెండు నెలలకు పైగా సుప్రీంకోర్టులో ఈ బెయిల్ హియరింగ్ విచారణలో వుంది. ఇన్ని రోజులు సమర్పించని రాతపత్రం టీడీపీ ఎంపీలు ‘సాక్షి’ ఆస్తులు అటాచ్ చేయించిన వెంటనే దాన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలోనే రాతపత్రంలో పొందుపరిచి కోర్టుకు సమర్పించారు. టీడీపీ వాళ్ల వినతి మేరకు ఈడీ అటాచ్ చేస్తుంది... చేసిన వెంటనే అక్టోబర్ 5న దానిని జతచేసి రాతపత్రం కోర్టుకు సమర్పించాలనేది కాంగ్రెస్, టీడీపీ, సీబీఐల వ్యూహం. అక్టోబర్ 5న ఈ కుట్రల వల్ల బెయిల్ రాలేదు. ఇది అందరూ కలిసి ఆడుతున్న నాటకమని, దీనివెనక బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎంత కుట్ర దాగివుందని అర్థమవుతుంది.

ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ఇన్ని ప్లాన్‌లు వేస్తున్నారు? వైయస్‌ఆర్ గారికి, జగన్‌కు ఉన్న ప్రజాభిమానం చూసి ఓర్వలేక వారిని ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారా? కానీ ఇలా చేస్తే వైయస్‌ఆర్ గారికి, జగన్‌కు ప్రజాభిమానం పెరిగేదే కాని తరిగేది కాదు. పెపైచ్చు ఇంత అన్యాయంగా కుట్రలు చేసే మీమీద అసహ్యం పెరగక మానదు. మిమ్మల్ని జనం అపనమ్మకంతో చూస్తారు. మీరు చేసేవన్నీ నాటకాలు అనుకుంటారు.

నిజం నిప్పులాంటిది. అన్నిరోజులు అందరినీ మోసం చేయలేరు. ప్రజాభిమానం పొందాలంటే మీ ఎంపీలను ఢిల్లీ పంపి ప్రజలకోసం వినతిపత్రాలు ఇవ్వండి. జగన్‌కు వ్యతిరేకంగానో, మీ కేసుల కోసమో కాకుండా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి... లేదంటే ఫోన్‌లో మాట్లాడి పనులు చేయించండి. ఫోన్‌లో మాట్లాడి, ఎంపీలను పంపి ఆస్తులు అటాచ్ చెయ్యగల సామర్థ్యం ఉన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ప్రజా సమస్యల కోసం వాడండి. ఒక పెన్షన్ ఇప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయించండి. కొన్ని గంటలైనా అదనంగా కరెంటు ఇప్పించండి. అప్పుడు ప్రజాభిమానం దానంతట అదే వస్తుంది. దేవుడిచ్చిన పలుకుబడిని ఒకరిని ఇబ్బందిపెట్టడానికి బదులు, ఒకరికి మేలు చేయడానికి వాడండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు.

ఈరోజు జగన్‌కు వుండే బలం అదే. ‘సాక్షి’ ఆస్తులు అటాచ్ చేస్తే జగన్‌ను దెబ్బతీసినట్టు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే జగన్ ఆస్తి ప్రజాభిమానం, దేవుని దయ. జగన్ పోరాటం తనకోసం కాదు... ప్రజలకోసం. అందుకే ప్రజలు జగన్‌ను అభిమానిస్తున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, మన రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు చనిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడడం సభ్యత కాదు అని కూడా మరచి మాట్లాడుతున్నారు. 2009కి ముందు అసలు హైదరాబాద్‌లోనే లేని, ప్రభుత్వంతో సంబంధం లేని జగన్ మీద నిందలు మోపి, కేసులు వేసి, కుట్రతో జైలుకు పంపారు. బెయిల్ రాకుండా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. ఈరోజు కొత్తగా జైలులో సౌకర్యాలు అని పాట పాడుతున్నారు. ఇన్ని మాటలు మాట్లాడే పెద్దమనుషులు వారిని ఎన్నుకున్న ప్రజలకోసం ఎంత మాట్లాడారు? వైయస్సార్ గారికి, జగన్‌కు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రజలు వీరిని నాయకులుగా చేసింది వీరి స్వప్రయోజనాల కోసం పోరాడడానికా, ప్రజల స్వరం వినిపించడానికా? జగన్‌కు వ్యతిరేకంగా చేసే

పోరాటంలో ఒక్క శాతం అయినా ప్రజలకోసం నిజంగా పోరాడండి. ప్రజలకు సౌకర్యాలను సాధించిపెట్టండి. అప్పుడు ‘మీకోసం’ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.

జగన్ ఆలోచనలన్నీ ప్రజలకోసం తనేం చెయ్యగలనా అని! అంతేకాని, మిమ్మల్ని ఎలా ఇరికించాలా, ఎలా ఇబ్బందులు పెట్టాలా అని కాదు. అందుకే జగన్‌ను ప్రజలు నమ్ముతున్నారు. అభిమానిస్తున్నారు. జగన్‌కు కుళ్ళు, కుట్రలు రావు, తెలీదు. అందుకే దేవుని దయ జగన్‌ను ఆశీర్వదిస్తుంది.


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్