నరసన్నపేట రూరల్, న్యూస్లైన్: భవిష్యత్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీదేనని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ధర్మాన కృష్ణదాస్
అన్నారు. ప్రజల మనసులో పార్టీకి సుస్థిర స్థానం ఉందని చెప్పారు. పెద
బొరిగివలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆదివారం ఆయన
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాసన్న మాట్లాడుతూ, అధికార,
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు.
ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ నాయకులు వివిధ పథకాలను ఎరవేస్తున్నారని
ఆరోపించారు. అభివృద్ధి పేరిట మంజూరు చేస్తున్న నిధులు, దీపం గ్యాస్
కనక్షన్లు కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో ఇస్తున్నవి కాదని, ప్రజా ధనమేనన్నారు.
ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు మంజూరు చేస్తున్న గ్యాస్ కనెక్షన్లు, ఇతర పథకాలను తీసుకుని ఓటు వేసే ముందు మాత్రం విజ్ఞతతో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు సరైన వ్యక్తో గమనించి ఓటు వేయాలన్నారు. మంత్రి ధర్మాన ప్రభుత్వ ధనాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తున్నారని, తన స్వార్థానికి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.
గతంలో పేదరికమే ప్రాతిపదికగా లబ్ధిదారుల ఎంపిక జరిగేదని, ప్రస్తుతం మంత్రి అండతో అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలే ప్రాతిపదికగా పథకాలు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటివి ఎన్నాళ్లూ సాగవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బ్రోకర్లుగా మారారని విమర్శించారు. పార్టీ మండలి కన్వీనర్ పొన్నాన దాలినాయుడు మాట్లాడుతూ ప్రజల మనసులో దాసన్న ఉన్నారని, ఎవరికీ బయపడకుండా పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు.
పొందరి కులసంఘం ప్రతినిధి బెహరా అప్పన్న మాట్లాడుతూ బొరిగివలస అభివృద్ధికి కృష్ణదాస్ ఎంతో కృషి చేశారని, అలాంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పొందరి తవుడు మాట్లాడుతూ కాంగ్రెస్ వారు చేస్తున్న బెదిరింపులకు ఎవరూ బయపడవద్దని, దాసన్నే మన నాయకుడన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరంగి మురళి, తంగుడు గిరి, సురంగి నర్శింగరావు, మార్పు విజయకుమార్, పతివాడ గిరీశ్వరావు, సాసుపల్లి కృష్ణబాబు, మూకళ్ల కృష్ణ, లుకలాపు రవి, పతివాడ గిరీశ్వరరావు,ధర్మాన శేఖర్, వూన్న వెంకటేశ్వరావు, వండాన జోగినాయుడు, విఠల్, సతివాడ రామినాయుడు, ఠాగూర్, పువ్వాడ చంటి పాల్గొన్నారు.
ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు మంజూరు చేస్తున్న గ్యాస్ కనెక్షన్లు, ఇతర పథకాలను తీసుకుని ఓటు వేసే ముందు మాత్రం విజ్ఞతతో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు సరైన వ్యక్తో గమనించి ఓటు వేయాలన్నారు. మంత్రి ధర్మాన ప్రభుత్వ ధనాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తున్నారని, తన స్వార్థానికి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.
గతంలో పేదరికమే ప్రాతిపదికగా లబ్ధిదారుల ఎంపిక జరిగేదని, ప్రస్తుతం మంత్రి అండతో అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలే ప్రాతిపదికగా పథకాలు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటివి ఎన్నాళ్లూ సాగవని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బ్రోకర్లుగా మారారని విమర్శించారు. పార్టీ మండలి కన్వీనర్ పొన్నాన దాలినాయుడు మాట్లాడుతూ ప్రజల మనసులో దాసన్న ఉన్నారని, ఎవరికీ బయపడకుండా పోలింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు.
పొందరి కులసంఘం ప్రతినిధి బెహరా అప్పన్న మాట్లాడుతూ బొరిగివలస అభివృద్ధికి కృష్ణదాస్ ఎంతో కృషి చేశారని, అలాంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పొందరి తవుడు మాట్లాడుతూ కాంగ్రెస్ వారు చేస్తున్న బెదిరింపులకు ఎవరూ బయపడవద్దని, దాసన్నే మన నాయకుడన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరంగి మురళి, తంగుడు గిరి, సురంగి నర్శింగరావు, మార్పు విజయకుమార్, పతివాడ గిరీశ్వరావు, సాసుపల్లి కృష్ణబాబు, మూకళ్ల కృష్ణ, లుకలాపు రవి, పతివాడ గిరీశ్వరరావు,ధర్మాన శేఖర్, వూన్న వెంకటేశ్వరావు, వండాన జోగినాయుడు, విఠల్, సతివాడ రామినాయుడు, ఠాగూర్, పువ్వాడ చంటి పాల్గొన్నారు.











